NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం 
    తదుపరి వార్తా కథనం
    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం 
    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం

    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం 

    వ్రాసిన వారు Stalin
    Aug 28, 2023
    06:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) డైరెక్టర్ల బోర్డుకు ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ రాజీనామా చేశారు.

    రిలయన్స్ కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ఈ విషయాన్నిప్రకటించారు.

    నీతా అంబానీ రాజీనామా నేటి నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

    నీతా అంబానీ రాజీనామాతో కంపెనీలో కీలక బాధ్యతలు వారి వారసులకు అప్పగించడానికి మార్గం సుగమం అయ్యింది.

    అంబానీ వారసులు ఇషా, ఆకాష్, ఆనంద్ రిలయన్స్ బోర్డుల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    ఇషా, ఆకాష్, ఆనంద్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఇప్పటికే బోర్టు ఉత్తర్వులు జారీ చేయగా, వాటాదారుల ఆమోదం తర్వాత వారి నియామకం అమల్లోకి వస్తుంది.

    రిలయన్స్

    రిలయన్స్ ఫౌండేషన్‌పై నీతా అంబానీ ఫోకస్

    నీతా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించడానికి ఆమె బోర్టుకు రాజీనామా చేశారు.

    అయితే నీతా రాజీనామా చేసినప్పటికీ అన్ని ఆర్ఐఎల్ బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా అమె ఇచ్చే సలహాలను కూడా కంపెనీ స్వీకరించనుంది.

    రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్‌గా ఆమె నాయకత్వం వహించడాన్ని డైరెక్టర్ల బోర్డు ప్రశంసించింది.

    ఇదిలా ఉంటే, అంబానీ వారసులు చాలా ఏళ్లుగా రిలయన్స్ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. రిటైల్, డిజిటల్ సేవలు, ఎనర్జీ, వంటి కీలక వ్యాపారాలకు వారు నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీలో కీలక బోర్టు డైరెక్టుర్లుగా వారు కొత్త పాత్ర పోషించబోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    ముకేష్ అంబానీ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  ముకేష్ అంబానీ

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత  హర్యానా
    లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు  కేరళ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?  బ్రిక్స్ సమ్మిట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025