భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Amit Shah: జూలై 26న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు.
National Handloom Award 2025: ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్
ప్రకృతి అందాలను,అందులోని విభిన్న జీవజాలాన్ని ఆరు గజాల పట్టు చీరపై అద్భుతంగా ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్ (55) జాతీయ చేనేత పురస్కారం-2025కు ఎంపికయ్యారు.
COVID: ఏపీలో కొత్తగా ఏడు కరోనా కేసులు.. 26కు చేరిన మొహమ్మారి
కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఆదేశించారు.
Anantapur: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్
అనంతపురం జిల్లాలోని రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బాతినేని విమలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు
చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్'కి చెందిన ఇద్దరు నేతన్నలు ప్రతిష్ఠాత్మక జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు.
Thammineni: రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైకాపా నేత,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Balakrishna: గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్
కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
Sharad Pawar-PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్ పవార్.. రాజకీయాల్లో కొత్త చర్చ
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Supreme Court: 'కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు'.. సీజేపీ కేసులో సుప్రీంకోర్టు
సీజేపీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Assam: అస్సాంలో వరదల విధ్వంసం.. ఒక్కరోజే 21 మంది మృతి, 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
అస్సాంలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది.
Telangana: ప్రభుత్వ విప్లకు మంత్రి హోదా.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో శాసనసభ వ్యవహారాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
High Court: 25 శాతం ఉచిత కోటా కింద మహిళకు చికిత్స అందించాలి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు ఆదేశం
ప్రభుత్వం జారీ చేసిన జీవోల నిబంధనలను అమలు చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Telangana: లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త బిల్లు సిద్ధం
తెలంగాణలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది.
Vijeta Dahiya: బర్గర్ వీడియో వివాదం.. పార్టీ పదవి కోల్పోయిన విజేత దహియా
విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో బర్గర్ తింటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించింది.
Kumki Elephants: మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!
అడవి ఏనుగుల దాడులతో పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్వతీపురం మన్యం జిల్లా రైతులు, గ్రామస్థులకు త్వరలోనే కొంత ఊరట లభించనుంది.
El Niño Impact: ఎల్నినో ఎఫెక్ట్: రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా?
ఇప్పుడు నిర్లక్ష్యంగా వృథా చేస్తున్న ప్రతి నీటి బొట్టు.. రాబోయే రోజుల్లో అమూల్యమైన వనరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
AP: ఏపీలో 123 పురపాలికల్లోనూ ఎన్నికలు.. పురపాలక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్లోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది.
AYUSH: ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయుష్ సేవలు.. ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) పరిధిని మరింత విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vande Bharat : దసరా నాటికి విజయవాడ డివిజన్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు
భారతీయ రైల్వేలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుడుతూ వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
Sikkim: మీథేన్ వాయువు పేలుడే కారణం.. సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి
సిక్కింలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Dharmendra Pradhan: నీట్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ రాజకీయాలకే ప్రాధాన్యం: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
Rahul Gandhi: మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ సహా నేతల అరెస్ట్
నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
AP Food Cluster: దావోస్లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది.
Delhi: ప్రధాని ఇంటి ముందు.. రాహుల్, ప్రియాంక బైఠాయింపు
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.
Noida: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. రూ.లక్ష పరిహారం చెల్లించాలన్న కమిషన్
ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో వీధి కుక్కల దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో గౌతమ్బుద్ధ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(District Consumer Disputes Redressal Commission) కీలక తీర్పు ఇచ్చింది.
Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్లో కేరళ సెయిలర్ మృతి
ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్ (26) జీవితం విషాదాంతమైంది.
Parliament: నీట్ పేపర్ లీక్పై విపక్ష ఆందోళన.. పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
Telangana: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
GATE 2027: గేట్-2027లో కొత్త రోబోటిక్స్ పేపర్.. సిలబస్లో కీలక మార్పులు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2027 పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజులపాటు వర్షాలు
ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
RF.5 COVID Variant: కరోనా కొత్త వేరియంట్ RF.5పై ఆందోళన వద్దు.. నిపుణుల సూచనలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ RF.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం: సీఎం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Crop Insurance: ఖరీఫ్ పంటలకు బీమా.. జులై 31లోగా ప్రీమియం చెల్లించండి
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల బీమా చేయించుకోవడం ఎంతో కీలకమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
Andhra Pradesh: తల్లీబిడ్డల కోసం త్వరలో 500 అధునాతన ఎక్స్ప్రెస్ వాహనాలు
మాతాశిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
CJP protest: గాయపడిన నిరసనకారులను పరామర్శించిన జేపీ నడ్డా
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో సోమవారం జరిగిన ఆందోళనల్లో గాయపడిన నిరసనకారులను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం పరామర్శించారు.
Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Parliament: ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా
పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొంది.
PM Modi: నీట్ పేపర్ లీక్ మహా పాపం.. మొదటిసారి స్పందించిన ప్రధాని మోదీ
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
Russian Diplomat: నలుగురు భారతీయ నావికులు మృతి.. రష్యా దౌత్యవేత్తకు సమన్లు
ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టుపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.
Indus Waters Treaty: ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే నదీ జలాలపై కొత్త ఒప్పందం: భారత్
భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.
Farmers Protest: ఢిల్లీలో రైతుల మహా పంచాయత్.. భారత్-అమెరికా ఒప్పందంపై ఆగ్రహం
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీలోకి చేరుకున్నారు.
CJP: నేడు మళ్లీ 'చలో సంసద్'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
పార్లమెంట్ వైపు చేపట్టిన 'చలో సంసద్' మార్చ్ దిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. మంగళవారం కూడా ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది.
Sikkim: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్దుంగ్-మామరింగ్ టన్నెల్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Heavy Rains: జమ్మూకశ్మీర్,ఉత్తరాఖండ్ను ముంచెత్తిన వర్షాలు.. నిలిచిపోయిన చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు
ఉత్తరాఖండ్,జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి.
Telangana: ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్కు 60,792 మంది వెబ్ ఆప్షన్లు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రెండో విడతకు 60,792మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసి బీటెక్ సీట్ల కోసం పోటీలో నిలిచారు.
AP Data on Loans: స్టాండప్, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు
స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Andhra Pradesh: 19కి చేరిన కరోనా కేసులు.. కడప జిల్లాలోనే 8 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి.
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు రూ.521.58 కోట్లతో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ఆమోదం
2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చేపట్టనున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్కరణల కమిటీ (ఎస్డీఆర్సీ) ఆమోదం తెలిపింది.
Rain Alert: తెలంగాణలో నేడు పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Ayodhya: అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపునకు ఎస్బీఐ కొత్త బృందం
విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టారు.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్'లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
జమ్ముకశ్మీర్'లోని పూంచ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Punjab Farmers: అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఛలో ఢిల్లీ .. జూలై 21న మహాపంచాయత్
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.
CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.