భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bengaluru: డెలివరీ బాయ్స్కు కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. రూల్స్ బ్రేక్ చేస్తే నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లోనే.. ఎక్కడంటే?
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
E20 Fuel: E20 ఇంధనంపై కొత్త చర్చ.. వర్షాల సమయంలో నీటి కలుషితం జరిగే అవకాశముందా?
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
Hydrogen Train: భారత్లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.
Centre Issues Advisory: హోర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయ నావికులను పంపొద్దు: కేంద్రం
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ దీక్ష 19వ రోజుకు.. వైద్య పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు
సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.
ISRO: ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం
ఇస్రోలో కీలక అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది.
NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్లో 111 ప్రశ్నలు లీక్.. అసలు పేపర్తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Telangana:అంగన్వాడీ చిన్నారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి తొలిముద్ద
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. 2026-27కు కొత్తగా 810 రాక
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) శుభవార్త చెప్పింది.
Telangana: తెలంగాణలోని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్లు తప్పనిసరి: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
Mamnoor Airport: మామునూరు.. దేశంలోనే ఒకప్పటి అతిపెద్ద విమానాశ్రయం.. మళ్లీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు
వరంగల్లోని మామునూరు విమానాశ్రయం త్వరలోనే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణ ఓటర్ల సర్వే గడువు పొడిగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ విడుదల
తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
KTR: కరవు పరిస్థితుల్లోనూ పట్టిసీమతో రైతులకు నీరు.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఎత్తిపోసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
Andhra Pradesh: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం
వాయవ్య బంగాళాఖాతం,దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Engineering Admissions 2026: ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.47 వేలు.. ఆగస్టు 10 నుంచి తరగతుల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్'లోని ఇంజినీరింగ్ కళాశాలలకు 2026-27 విద్యాసంవత్సరానికి కనీస ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ప్రాథమికంగా రూ.47 వేలుగా నిర్ణయించింది.
NMC: రాష్ట్ర వైద్యకళాశాలల్లో 375 ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్ఎంసీ మ్యాట్రిక్స్ విడుదల
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ల మ్యాట్రిక్స్ను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది.
Visakhapatnam: విశాఖలో రూ.4 వేల కోట్ల టెక్స్టైల్స్ రీసైక్లింగ్ యూనిట్.. భారత్ టెక్స్-2026లో ఏపీకి భారీ పెట్టుబడులు
భారత్ టెక్స్-2026 ప్రదర్శనలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి.
Kirlampudi: కిర్లంపూడి పీఎస్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
AP: ఉద్యోగుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్.. ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యక్ష నియామకాల నియంత్రణకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
Amaravati 2.0: అమరావతి-2.0 మాస్టర్ప్లాన్కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్ప్లాన్ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
IRCTC Beta Portal: ఐఆర్సీటీసీ కొత్త బీటా వెబ్సైట్ ప్రారంభం.. టికెట్ బుకింగ్ మరింత సులభం
రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఐఆర్సీటీసీ (IRCTC) కొత్త బీటా వెర్షన్ వెబ్సైట్ను బుధవారం రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
TTD: టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు.. ఒక్కరోజులో రూ.96.98 కోట్ల విరాళాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది.
Karnataka: ధార్వాడ్లో దారుణం.. ఇంట్లో అనస్థీషియా వైద్యుడి హత్య,8 ఏళ్ల కొడుక్కి కత్తిపోట్లు.. పోలీసుల అదుపులో భార్య
కర్ణాటకలోని ధార్వాడ్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
EC: ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సిద్ధం: ఈసీ
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది.
AP government: ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త దిక్సూచి.. రామాయపట్నం పోర్టుతో 25 వేల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Dalmia Cement Plant: కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి
కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
Telangana: తెలంగాణలో మద్యం ధరల పెంపుపై జూలై 17న కీలక నిర్ణయం.. కొత్త బాటిల్ సైజుపైనా చర్చ
తెలంగాణలో మద్యం ధరల సవరణకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
Viral Video: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించిన ఎస్సై.. కేసు నమోదు
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు.
Air India Crash: అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియా ప్రమాదంపై తుది ముసాయిదా నివేదిక: AAIB
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని,ఈ కేసుకు సంబంధించిన డ్రాఫ్ట్ తుది నివేదిక (Draft Final Report) అక్టోబర్ 2026 నాటికి సిద్ధమవుతుందని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సుప్రీంకోర్టుకు తెలిపింది.
Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. అస్సాం రైఫిల్స్ శిబిరంపై రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు
మణిపూర్లోని సెనాపతి జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Polish Minister: ఉక్రెయిన్లో అణ్వాయుధాల వినియోగాన్ని మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ మంత్రి
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్స్కీ పేర్కొన్నారు.
Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Ayodhya: అయోధ్య రామాలయ సీఈవో పదవికి భారీ స్పందన.. 24 గంటల్లోనే 1,000 దరఖాస్తులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పదవికి భారీ స్పందన లభిస్తోంది.
DGFT: ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ భారీ డేటా సెంటర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కొత్త డేటా సెంటర్ విస్తరణకు సిద్ధమైంది.
Telangana: బీటెక్ అదనపు సీట్లపై కసరత్తు.. తుది విడత కౌన్సెలింగ్కు ముందు నిర్ణయం
ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్ల అంశంపై దృష్టి సారించింది.
Telangana: ఎల్నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Telangana: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. మరో వారం ఎండలే..
తెలంగాణలో ప్రస్తుతం వర్షాలకు విరామం కొనసాగుతోంది. మరో వారం రోజుల వరకు రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన
విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు.
Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTR Health University: ఫ్యామిలీ మెడిసిన్ నుంచి క్వాంటమ్ బయాలజీ వరకు.. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కొత్త కోర్సులకు సన్నాహాలు
భవిష్యత్ వైద్య రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు,వైద్య విద్యార్థులను మరింత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఎన్టీఆర్యూహెచ్ఎస్) కీలక చర్యలు చేపడుతోంది.
India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి
భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. దాతల ప్రివిలేజెస్లో భారీ మార్పులు
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రత్యేక సదుపాయాల్లో(ప్రివిలేజెస్)పలు మార్పులు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో విషాదం.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు.
SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్-సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో 2028-2029 కాలానికి శాశ్వతేతర సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది.
Iranian deputy ambassador: వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి.. ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు
హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం,పలువురు గాయపడడం నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్లో కొత్త నిబంధనలు అమల్లోకి ..
తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Pawan kalyan: పవన్కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు.
Amaravati Championship 2.0: జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోటీలు.. పోస్టర్ను ఆవిష్కరించిన శాప్ ఛైర్మన్,ఎండీ
ఆంధ్రప్రదేశ్ను 'క్రీడాంధ్రప్రదేశ్'గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు.
Piduguralla: పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 సీట్లతో ఈ ఏడాదే తరగతులు
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది.
Andhra Pradesh: రెండో విడత జాబ్ క్యాలెండర్కు విడుదలకు కసరత్తు.. పోస్టుల భర్తీపై సీఎస్ సాయిప్రసాద్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
Amaravati: అమరావతిలో ఐదెకరాల్లో 'మినీ అమెజాన్'.. శాఖమూరు పార్కులో రూ.17.58 కోట్లతో కృత్రిమ రెయిన్ ఫారెస్ట్
దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.
Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్లో చోటు
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్ను కానుకగా అందించారు.
Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు
భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్ప్రదేశ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh: విద్యుత్ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
Andhra Pradesh: ఏపీలో 8 ప్రైవేటు పారిశ్రామిక పార్కులు.. 4,196 ఎకరాల్లో పరిశ్రమలకు కొత్త అవకాశాలు
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
SIR: ఓటర్లకు కీలక హెచ్చరిక.. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు.
#NewsBytesExplainer: ఫామ్-6లో కీలక మార్పు.. తల్లిదండ్రుల SIR సమాచారం ఎందుకు అడుగుతున్నారు?
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది.
Supreme Court: పౌరసత్వ నిర్ధారణలో పారదర్శకత తప్పనిసరి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి
'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
Hyderabad: హైదరాబాద్లో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం.. భవిష్యత్లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక
రాజధాని హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం ఆందోళనకరంగా పడిపోతోంది.
Weather Report: జులైలోనూ తగ్గని ఎండల తీవ్రత.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Emirates A380: హైదరాబాద్కు ఎమిరేట్స్ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్తో కీలక చర్చలు
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ వెల్లడించారు.
Amaravati Quantum Valley: సమాచార భద్రతకు భరోసా పీక్యూసీ.. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్గా అమరావతి
ప్రపంచ దేశాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న అతిపెద్ద సైబర్ భద్రతా సవాళ్లలో ఒకటిగా క్వాంటమ్ కంప్యూటింగ్ను నిపుణులు భావిస్తున్నారు.
El Niño: ఎల్నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో వరిసాగు సగానికి పడిపోవచ్చని అంచనా
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్ఎస్సీ-2027' ప్రారంభం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్ఎస్సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.
Almatti: ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు.. నాలుగు రోజుల్లో మరింత తగ్గే అవకాశం
కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు
మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
SIR: జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండదు
ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు.
Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.