భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AI Summit: ఏఐ సమిట్ తొలి రోజే అవస్థలు.. క్షమాపణలు చెప్పిన ఐటీ మంత్రి
భారత్ ఆతిథ్యంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో అవసరమైన ఏర్పాట్లు సరిగా లేవని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kerala HC: ఉద్యోగి రాజీనామా నిరాకరణ బానిసత్వంతో సమానం: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉద్యోగుల హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ
దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది.
Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్ పిటిషన్ను తిరస్కరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా గంటలోపు విమానాశ్రయం చేరేలా కొత్త ప్రణాళిక.. రూ.6,416 కోట్లతో తొమ్మిది కొత్త విమానాశ్రయాల అభివృద్ధి
ఏపీలోని ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గంలో గంటలోపు ప్రయాణిస్తే విమానాశ్రయానికి చేరుకునే విధంగా సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.
Actress Prathyusha Case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు..సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం
ప్రముఖ టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది.
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Meerut Metro: గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న మీరట్ మెట్రో
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రవాణా వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
cyber crime: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసుల కొత్త అస్త్రం 'సెంటినల్'
సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులకు మరింత బలమైన సాంకేతిక సహాయం లభించింది.
Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) చీఫ్ ఇంజినీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు.
AI Impact Summit 2026: విద్యలో ఏఐ సాధనాలు విఫలం.. స్థానిక భాషలే కీలకం: రొమానా క్రోపిలోవా
మధ్య ఆదాయ దేశాల్లో విద్యారంగంలో ప్రవేశపెట్టిన కొన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ సంస్థ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.
JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.
Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం
ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
CBSE: మొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తేనే.. రెండవ పరీక్ష రాయగలరు: సీబీఎస్ఈ క్లారిటీ
సీబీఎస్ఈ పది తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్ కోసం కోట్ల నిధుల విడుదల!
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
AI Impact Summit 2026: AIతో ఉద్యోగాలకు ముప్పు లేదు.. ఉత్పాదకతే పెరుగుతుంది: పారిశ్రామికవేత్తలు
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi: మోదీ-నెతన్యాహు భేటీకి రంగం సిద్ధం.. వచ్చే వారం ఇజ్రాయెల్కు ప్రధాని పర్యటన
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం ఇజ్రాయెల్కు వెళ్లనున్నట్లు సమాచారం.
Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Rajasthan: భివాడీలో రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి
రాజస్థాన్లోని పారిశ్రామిక కేంద్రం భివాడీలో ఉన్న ఒక రసాయన తయారీ కర్మాగారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్ వివరాలు..
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.
Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు.
Renewable Energy: దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
Kerala: అవయవదానంతో ఐదుగురికి జీవితం ఇచ్చిన 10 నెలల చిన్నారి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
కేరళలో ఆదివారం 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహామ్కు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Uttar Pradesh: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి
రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.
AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత్లో కృత్రిమ మేధస్సు రంగానికి మరో కీలక ఘట్టంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.
GHMC: ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్
హైదరాబాద్'లోని ఐటీ కారిడార్లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
నీటి వినియోగానికి సంబంధించిన లెక్కల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాస్తవాలకు విరుద్ధంగా గణాంకాలు నమోదు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Kurnool: కోడుమూరు పొలాల్లో అరుదైన 'రామదాసు' పక్షి దర్శనం
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి సమీపంలోని పంట పొలాల్లో అరుదైన పక్షి దర్శనమిచ్చింది.
Andhra Pradesh: వయసు అడ్డుకాదు.. సంకల్పమే ముఖ్యం: వెటరన్ అథ్లెట్గా బామ్మ సంచలనం
జీవితంలో గెలుపు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఉదాహరణ ఈ బామ్మ.
Bill Gates: నేడు రాజధానికి బిల్గేట్స్ బృందం.. స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజంటేషన్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి రానున్నారు.
Hyderabad:హైదరాబాద్కు 3డీ డిజిటల్ ట్విన్ సిటీ… హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభం
హైదరాబాద్ నగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు ప్రారంభించింది.
Vikarabad-Krishna railway line: రూ.2,750 కోట్లతో వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్కు డీపీఆర్ సిద్ధం
దక్షిణ తెలంగాణలోని పలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టు తదుపరి దశకు చేరుకుంది.
MP Imran Masood: వందే మాతరం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ మసూద్ ఘాటు వ్యాఖ్యలు
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. రేపు ఆప్షనల్ హాలీడే!
ఈసారి మహాశివరాత్రి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది.
Asaduddin Owaisi: 'చరిత్రను వక్రీకరించొద్దు'.. మాలేగావ్ వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మాలేగావ్లో చోటుచేసుకున్న 'టిప్పు సుల్తాన్' ఫోటో వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసింది.
Northeast: ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్వే ప్రారంభం
దేశ రక్షణ వ్యూహానికి బలాన్నిస్తూ, పౌర-సైనిక అవసరాలను సమన్వయం చేసే చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది.
S Jaishankar: చమురు కొనుగోళ్లలో రాజకీయ ప్రభావం ఉండదు: జైశంకర్
భారత ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: కొత్త బడ్జెట్పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. నలుగురికి గాయాలు
ముంబై నగరంలోని ములాద్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో రైలుకు సంబంధించిన ఒక పిల్లర్ కూలిపోవడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది.
BJP: రాజకీయ పార్టీలకు నిధుల కేటాయింపు.. అగ్రస్థానంలో బీజేపీ.. కాంగ్రెస్ స్థానం ఎంతంటే?
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు చేరిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సింహభాగం లభించింది.
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం
ఫిబ్రవరి 14, 2019... దేశ చరిత్రలో మరచిపోలేని దుఃఖదినం. ఆ రోజు భారత్ 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది.
AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
Miss Grand AP: మిస్ గ్రాండ్ ఏపీ -2026గా డాక్టర్ దివ్య వారణాసి
హైదరాబాద్లో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.
Seva Teerth: సౌత్ బ్లాక్కు భిన్నంగా మోదీ కొత్త కార్యాలయం.. సేవా తీర్థ్ ప్రత్యేకతలివే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి కొత్త చిరునామా సిద్ధమైంది.
Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Telangana: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Singareni: సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాశ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
Hyderabad: హైదరాబాద్ బస్తీల్లో సంచార అంగన్వాడీలు… 37 మొబైల్ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
RERA: 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్
ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
Gandhi Sarovar: గాంధీ సరోవర్కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం
మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు.
Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానున్న 'హ్యాపీ సండే' కార్యక్రమం
ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది.
AP High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి ప్రమాణ స్వీకారం
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
Andhra Pradesh : అగ్రిగోల్డ్ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ
అగ్రిగోల్డ్పై క్రిమినల్ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది.
Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్ హబ్గా ఏపీ: నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూప్రింట్
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్ను సిద్ధం చేసింది.
Andhra Pradesh : కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఏకీకృత విధానం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు విషయంలో ప్రతి విశ్వవిద్యాలయం ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చి వీటి స్థానంలో ఏకీకృత విధానం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
Trade deal: భారత గార్మెంట్లకు అమెరికా మార్కెట్లో ఊరట.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్షీట్ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సవరించిన నేపథ్యంలో, న్యూఢిల్లీకి మరిన్ని రాయితీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భారత్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ
గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.
Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Mohan Bhagwat: వీధి కుక్కల సమస్యకు మధ్యమార్గమే పరిష్కారం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh: అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్గేట్ల రుసుం మినహాయింపు
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్గేట్ల వద్ద వసూలు చేసే రుసుం పూర్తిగా మినహాయిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు.
Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: 'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.