భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రయాణికులు దుర్మరణం
అమెరికా మిన్నెసోటాలోని ట్విన్ సిటీస్ ప్రాంతం సమీపంలో శనివారం (సెప్టెంబర్ 6) ఒక హెలికాప్టర్ కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు ధృవీకరించారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా నిలిచింది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. మొత్తం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్ చలానాలు.. 50% డిస్కౌంట్తో జరిమానా క్లియర్!
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Red Fort: దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోట నుంచి రూ.కోటి విలువైన బంగారు కలశాల దొంగతనం!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)లో సంచలన దొంగతనం చోటుచేసుకుంది.
Hyderabad Drug: హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
హైదరాబాద్లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు.
Tihar Jail: నీరవ్ మోదీ, సంజయ్ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్ జైలును పరిశీలించిన యూకే బృందం!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి.వినాయక నిమజ్జన సమయంలో వచ్చిన బెదిరింపు మెయిల్ ముంబై పోలీస్ సిబ్బందిని హై అలర్ట్లోకి మార్చింది.
YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు సిట్ అధికారులు ఏ4గా చేర్చారు.
Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది.
Operation Sindoor: పాక్తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
PM Modi-Trump: గొప్ప ప్రధాని అన్న ట్రంప్.. మోదీ ఇచ్చిన రిప్లై ఇదే!
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్షీట్ దాఖలు
హనీమూన్కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Hyderabad: హైదరాబాద్లో జోరుగా గణేశ్ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి.
Khairatabad ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభం (వీడియో)
ఖైరతాబాద్లోని బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఈ మహాగణపతిని దర్శించడానికి వచ్చారు.
Gunther Fehlinger-Jahn: భారత్'పై వ్యతిరేక పోస్ట్ పెట్టిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త .. X ఖాతాను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ ను నాశనం చేయాలి" అని బహిరంగంగా పోస్ట్ చేసిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త గుంథర్ ఫెహ్లింగర్-జాన్ X సోషల్ మీడియా ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
CDS Anil Chauhan: 'చైనాతో సరిహద్దు వివాదం భారతదేశానికి అతిపెద్ద సవాలు': గోరఖ్పూర్లో CDS అనిల్ చౌహాన్
ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలుగా చైనాను పేర్కొన్నారు.
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
GST Reforms: బెంజ్ కార్లు,హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ సాధ్యం కాదు: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
మన దేశ ఆర్థిక వ్యవస్థలో విభిన్నతలు ఎక్కువగా ఉండటం వలన, ఒకే పన్ను విధానాన్ని అన్ని పరిస్థితుల్లో అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Drama in Kannauj:అరెస్టును తప్పించుకునేందుకు.. అటక మీద పరుపులో దాక్కున్న మాజీ ఎంపీ
ఈ రోజులలో రాజకీయ నాయకులు చాలా తెలివి మీరిపోయారు. ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో, సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ కైషా ఖాన్ నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు.
National Teacher Awards: 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్ అవార్డు 2025 ప్రదానం.. ఏపీలో ఆయనే ఉత్తమ ఉపాధ్యాయుడు
విద్యార్థుల అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో అద్భుతమైన కృషిని చూపిన ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు.
Chandrababu: సీఎం చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనంవేళ..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.
Congress-BJP: బీడీ,బిహార్ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్ పోస్టుపై వివాదం
కేంద్రం సిగరెట్,పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులను విమర్శిస్తూ,కేరళ కాంగ్రెస్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టింది.
Nara Lokesh: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Mumbai: 34 బాంబులు,400 కిలోల ఆర్డీఎక్స్.. 14మంది పాక్ ఉగ్రవాదులు.. బెదిరింపు మెయిల్తో ముంబైలో హైఅలర్ట్
ముంబైకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు.
Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. సంచలన కేసులో క్లీన్చిట్
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల వివాదంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది.
Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వైరల్ అవుతున్న వీడియో
ఈ ఏడాది ఉత్తర భారతదేశం భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Tragedy: అన్న వరస అవుతాడని పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ.. చివరికి యువతి ఆత్మహత్య!
కొన్ని ప్రేమకథలు సుఖాంతం చెంది పెళ్లి బంధంతో ముగుస్తుంటే.. మరికొన్ని ప్రేమలు దురదృష్టకరంగా విషాదాంతం అవుతున్నాయి.
Telangana High Court: హైకోర్టులో ఉద్రిక్త వాతావరణం.. న్యాయమూర్తిపై కక్షిదారు దురుసు ప్రవర్తన!
హైకోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్లో తీర్పు వెలువరించలేదని కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై కక్షిదారు దురుసుగా ప్రవర్తించారు.
Ajit Pawar:అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్,ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం వైరల్గా మారింది.
Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమవటంతో సముద్రం పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక హెచ్చరికను జారీ చేసింది.
Hyderabad: రేపే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
హైదరాబాద్లో శనివారం గణేష్ నిమజ్జనాల సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు.
Bathukamma celebrations: ఓనం రికార్డును అధిగమించేందుకు బతుకమ్మ వేడుకలు సిద్ధం.. లక్షలాది మహిళలతో కొత్త చరిత్ర
తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ ఉత్సవాలకు పూర్తిగా సిద్ధమవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.
Hyderabad : ఇక వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం పెద్ద డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఇక లేదు.
India: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధం: UNలో రాయబారి హరీష్
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Voter ID: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీ ఉంటే తప్పనిసరిగా సరెండర్ చేయాలి : ఎన్నికల సంఘం
ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల (Voter ID)విషయంలో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ (Universal Health Policy)కి ఆమోదం తెలిపింది.
Pm Modi: దీపావళికి ముందే ప్రజలకు ఆనందం : మోదీ
యూపీఏ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Infant Mortality Rate: దేశంలో కనిష్ట స్థాయికి శిశు మరణాల రేటు.. పదేళ్లలో ఎంతంటే..!
దేశంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR)రికార్డు స్థాయికి పడిపోయింది.
Narendra Modi: భారతదేశం-సింగపూర్ సంబంధాలు దౌత్యానికి అతీతమైనవి: ప్రధాని మోదీ
భారత్, సింగపూర్ మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్య పరిమితికి మాత్రమే సంబంధించినవి కావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
IIT Madras: ఎన్ఐఆర్ఎఫ్ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF) 2025 జాబితాను ప్రకటించారు.
Supreme Court: అక్రమంగా చెట్లను నరికివేయడం వల్లే విపత్తులకు కారణం: సుప్రీంకోర్టు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.
School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్. మరోసారి వరుసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి.
Nagpur: సోలార్ ప్లాంట్లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా, కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో, బజార్గావ్లోని సోలార్ ఇండస్ట్రీస్లో భారీ పేలుడు సంభవించింది.
Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది.
Delhi: ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి
భారీ వర్షాలు,వరదల కారణంగా యమునా నది 63 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది,ఇది ఢిల్లీలో తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది.
Hyderabad: హైదరాబాద్ నుంచి ఆమ్స్టర్డామ్కు నేరుగా విమానం.. ప్రారంభించిన కేఎల్ఎం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమ్స్టర్డామ్ షిపోల్ విమానాశ్రయానికి కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను ప్రారంభించింది.
Andhra pradesh: రైళ్లలో 139 హెల్ప్లైన్.. ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం
ఒకప్పుడు రైల్లో ప్రయాణిస్తుంటే ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ప్రయాణికులు తరువాత వచ్చే స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించేవారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 2025 సెప్టెంబరు 7 వరకు సెలవులు ప్రకటించింది.
Indigo: ఢిల్లీ-కోల్కతా విమానంలో తాగిన మత్తులో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన.. స్పందించిన విమానయాన సంస్థ
దిల్లీ నుండి కోల్కతాకు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6571లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Pahalgam attack: పహల్గాం దాడి వెనక పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ నిధులు
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పరిశీలనలో, లష్కరే ముస్లిమ్ గ్రూప్కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)కు వివిధ దేశాల నుంచి నిధులు అందినట్లు గుర్తించబడింది.
Balakrishna: 'వస్తాను.. ఎట్లా వస్తానో చెప్పను': మంత్రి నిమ్మలతో బాలయ్య ఆసక్తికర సంభాషణ
ప్రముఖ సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలుసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది.
Special Trains: దసరా,దీపావళి పండుగ వేళ.. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వే గుడ్న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది.
Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది.
Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీకి,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. పార్టీపై సంచలన కామెంట్స్..
భారత రాష్ట్ర సమితి (BRS)లోని కొందరు సీనియర్ నేతలు తనపై కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు.
Tejashwi Yadav: పాట్నాలో నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్
బిహార్లోప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
UP: ఇన్స్టాలో వివాహితతో ప్రేమ.. పెళ్లి చేసుకోమనడంతో హోటల్కు పిలిచి హత్య
భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధం అత్యంత పవిత్రమైనది.
S-400: అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్ చర్చలు
ఆపరేషన్ సిందూర్లో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ సైన్యంలో భయంకర వణుకును సృష్టించింది.
Red Alert: రికార్డు స్థాయిలో వర్షాలు.. పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్లో రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి.
Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు మరింత వేడెక్కుతున్నాయి.
Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!
సాధారణంగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలంటే రోగులు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Hydraa Toll Free Number: వరదలు, అగ్ని ప్రమాదాల్లో అత్యవసర సేవల కోసం హైడ్రా.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
హైదరాబాద్ నగరంలో ప్రజా భద్రత, ఆస్తుల రక్షణ కోసం హెచ్డిఆర్ఏ (హైడ్రా) టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురాబడింది.
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన.. లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకి జిల్లా గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేని కోర్సుల నడుపుదలపై విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.