ఆంధ్రప్రదేశ్: వార్తలు

ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

17 Mar 2023

తెలంగాణ

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.

16 Mar 2023

దిల్లీ

దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది.

AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279కోట్ల వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

15 Mar 2023

ముంబై

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

11 Mar 2023

బీజేపీ

బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

09 Mar 2023

తెలంగాణ

ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు

సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి.

కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.

04 Mar 2023

వైజాగ్

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

03 Mar 2023

తెలంగాణ

ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత

ప్రముఖ రచయిత, ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

03 Mar 2023

వైజాగ్

వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.

ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ పరిసరాల్లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు.

28 Feb 2023

ఇస్రో

చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

చంద్రయాన్-3 మిషన్ కోసం లాంచ్ వెహికిల్‌లోని క్రయోజెనిక్ పై స్టేజ్‌కి శక్తినిచ్చే సీఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్‌కు సంబంధించిన ఫ్లైట్ యాక్సెప్టెన్స్ హాట్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.

మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మార్పు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు లోకేశ్. అయితే ఎన్టీఆర్ మాజీ సన్నిహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.

అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు

అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

24 Feb 2023

గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు

Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.

నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

బీఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో విస్తరింపజేసేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో బీఆర్ఎస్ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్‌పేపర్‌ పేరును కూడా 'నమస్తే ఆంధ్రప్రదేశ్‌'‌గా ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.

2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాను అసెంబ్లీ కంటే వైజాగ్‌ లోక్‌సభ సీటుకే ప్రాధాన్యత ఇస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు.

21 Feb 2023

గన్నవరం

పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

21 Feb 2023

గన్నవరం

'24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.

21 Feb 2023

గన్నవరం

టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు

గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) వివిధ కోటాల కింద మార్చి 13, 2023న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 18 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

19 Feb 2023

బడ్జెట్

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

మునుపటి
1
తరువాత