LOADING...
Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో విద్యా రంగంలో సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇకపై టెన్త్ పరీక్షలు రద్దు అయ్యేలా సిద్ధమవుతున్నట్టు చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత సమగ్రత, సౌలభ్యంతో ముందుకు సాగేలా కేంద్రంగా దృష్టి పెడుతోందన్నారు. అదేవిధంగా బీసీఆర్ హయాంలో 6 వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులపై ప్రాసెస్ ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు.

వివరాలు

విచారణ పూర్తి కాకుండా అరెస్టు చేయలేం

విచారణ పూర్తి చేయకుండా అరెస్ట్ చేయలేమని, సంబంధిత-స్టేట్ మెంట్ లను సరిగ్గా రికార్డ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పంజాగుట్టలోని ప్రైవేట్ కేసులో కూడా క్లీన్ చిట్ దక్కిందని తెలిపారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు, బీసీఆర్ హయాంలో జరిగే ఫోన్ ట్యాపింగ్‌లు, విచారణలు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో కేటీఆర్, హరీశ్ రావు ఎవరైనా విచారణ కోరినప్పటికీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని సీఎం స్పష్టం చేశారు.

Advertisement