LOADING...
Indians Return: పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!
పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!

Indians Return: పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక వివరాలను వెల్లడించింది. ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతైనట్లు అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ తెలిపారు. ఒమన్‌లోని సోహర్ నగరంలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను ఇప్పటికే జైపూర్‌లోని వారి కుటుంబాలకు తరలించినట్లు చెప్పారు. ఇరాన్‌ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్ మార్గాల ద్వారా సుమారు 700 మంది భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. వీరిలో 284 మంది యాత్రికులు ఉండగా, అందులో 130 మంది ఈరోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు మొత్తం 2.44 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలి

Details

ప్రత్యేక విమానాల సాయంతో తరలింపు

కువైట్ వైమానిక మార్గం మూసివేయబడినప్పటికీ, సౌదీ అరేబియా ద్వారా ప్రత్యేక విమానాల సాయంతో తరలింపు కొనసాగుతోంది. యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుంచి పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ సమస్యపై బ్రిక్స్ (BRICS) దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కష్టంగా మారిందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సంక్షోభం ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశముందని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ ఐరోపా సమాఖ్య (EU) వేదికగా స్పష్టం చేసింది. భారతీయుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది.

Advertisement