ఐపీఎల్: వార్తలు

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..?

ఐపీఎల్ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో పలు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. కోల్‌కత్తా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి దూరమయ్యే అవకావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌షాక్

ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

స్టార్ ఆటగాళ్లతో పట్టిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రెండు సీజన్లు వరుసగా విఫలం కావడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లు ఫ్రాంఛేజీ వదలుకుంది.

ఐపీఎల్ 2023లో స్పాట్ ఫిక్సింగ్ క్రికెటర్.. పదేళ్ల తర్వాత శ్రీశాంత్ ఎంట్రీ

ఐపీఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభ కానుంది. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లాంటి నేరగానికి పాల్పడి క్రికెట్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్‌లో శ్రీశాంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఐపీఎల్‌ 2023లో ఆర్సీబీ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్‌లో ముంబైతో ఢీ

ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ మొదటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ.. కొన్ని ఫ్రాంచేజీలకు ఊహించిన షాక్‌లు తగులుతున్నాయి. గాయాల వల్ల, కొన్ని ఇతర కారణాలతో అయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే చైన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2023 మినీ వేలంలో అతన్ని సీఎస్కే కోటీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఆర్సీబీకి గట్టి ఎదురుబెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

ఐపీఎల్ 2023 ప్రారంభానికే ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో విల్ జాక్స్ గాయపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లిపోయాడు.

సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. అందుబాటులో స్టార్ ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 ఎడిషన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. చాలామంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఫ్రాంచైజీల్లో అందోళన మొదలైంది. తాజాగా కొన్ని టీంలకు గుడ్ న్యూస్ అందింది.

ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ

RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది .

Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా

చైన్నై సూర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్సోక్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఇంగ్లండ్ యాజమాన్యం ఐపీఎల్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చింది.

దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల తరువాత ఐపీఎల్ అడునున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇక నెల కంటే ఎక్కువ సమయం లేదు. ఈ సమయంలో చైన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు.

WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని బెంగళూర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఉమెన్స్ లీగ్ వేలంలో మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. వేలంలో రూ.3.కోట్ల 40 లక్షలకు బెంగళూర్ స్మృతి మంధాన కొనుగోలు చేసింది.

ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫీలందించిన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం కొంచెం కష్టమైన ప్రశ్న, కెప్టెన్ భారత జట్టుకు ధోని ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ముంబైకి రోహిత్ ఒంటోచెత్తో ట్రోఫీలందించిన ఘనత ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో గొప్పొ తేల్చడం కష్టమే.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. మార్చి 31న సీజన్ మొదలు కానుంది. చివరి మ్యాచ్ మే 28న జరగనుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్

భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఈ ఏడాది ఐపీఎల్ టీ20 టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. అతను గతంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు.

16 Jan 2023

గుజరాత్

నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.

ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు

ఉమెన్స్ ఐపీఎల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి జరగనున్న ఈ లీగ్ హక్కులు ఏకంగా రూ.951 కోట్లకు అమ్ముపోయామంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ

భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.

ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్

రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్, ఫిటినెస్ సమస్యతో బాధపడుతున్నారు. దాని ప్రభావం అతని సంపాదన మీద పడకపోవడం గమనార్హం. సంపాదనలో ఏకంగా ధోని, కోహ్లీని వెనక్కి నెట్టి ఐపీఎల్ లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు.