
IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజు ముగియనుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్ తలపడుతున్నారు.
రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదని ప్రత్యేకత ఉంది.
అందుకే ఈసారి ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కలను నిజం చేసుకుంటుంది. అయితే కోట్లాది మంది అభిమానులు ఆర్సీబీకి విజయం సాధించాలని ప్రత్యేకంగా కోరుతున్నారు.
ఈ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ తరపున తొలిసారి ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లీ మాత్రం పదిహేడేళ్లుగా ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ గెలవాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Details
ఆర్సీబీ గెలవాలని పూజలు
కేవలం అభిమానులే కాదు, సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఆశిస్తున్నారు.
ఆర్సీబీ గెలుపుపై ఫ్యాన్స్ ప్రత్యేక లెక్కలు కూడా పెట్టుకున్నారు. కోహ్లీ జెర్సీ నంబర్ 18 అని తెలిసిందే. ఈ రోజుతో (జూన్ 3, 2025) తేదీ, నెల, సంవత్సరం సంఖ్యలను కలిపితే 18 వస్తుంది.
దీనితో ఫ్యాన్స్ ఈ సీజన్లో కోహ్లీ టీమ్కు టైటిల్ అందాలని భక్తి భావంతో నమ్ముతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది.
అయితే ఆర్సీబీ అభిమానులకు మరొక ఆందోళన కూడా ఉంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కూడా జెర్సీ నంబర్ 18ను ధరిస్తున్నాడు.
Details
ఈ ఐపీఎల్ లో 8 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ
ఈ కారణంగా పంజాబ్ తరపున కూడా అదృష్టం కలిసి రావచ్చనే ఆశ ఉంది. అందుకే ఈ జెర్సీ నంబర్ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కొంత ఆందోళన పడుతున్నారు.
ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 14 మ్యాచ్ల్లో 614 పరుగులు చేశారు, అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అదే సమయంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రియాంష్ ఆర్య 16 మ్యాచ్ల్లో 451 పరుగులు చేసి ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు.
కాబట్టి, జెర్సీ నంబర్ 18 ఎవరిలో అదృష్టాన్ని తెచ్చుకొస్తుందో ఈ రోజు చూస్తేనే తెలుస్తుంది.