
Yash Dayal: ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్పై కేసు నమోదు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ యష్ దయాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన యువతి ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. సదరు యువతి యూపీ సీఎం పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె తెలిపిన ప్రకారం.. క్రికెటర్ యష్ దయాల్తో ఇదివరకు ఐదేళ్లుగా సంబంధం ఉందని, పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. తనను 'కాబోయే కోడలు' అంటూ కుటుంబ సభ్యులకు పరిచయం చేసిన తర్వాత, అనూహ్యంగా దూరమయ్యాడని తెలిపింది.
Details
మానసికంగా వేధించాడని ఫిర్యాదు
తరువాత దయాల్కి ఇతర యువతులతో సంబంధాలున్న విషయం తెలిసిందని, దీనిపై ప్రశ్నించగా తనను మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఈ నెల 14న మహిళా హెల్ప్లైన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. తాను పోలీసులకు వాట్సాప్ చాట్స్, స్క్రీన్షాట్స్, వీడియో కాల్స్, ఫొటోలు వంటి ఆధారాలు సమర్పించానని తెలిపిన బాధితురాలు, దయాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా యష్ దయాల్పై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ నిమిష్ పాటిల్ స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న వాస్తవాలను పరిశీలించిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.