NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు
    శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2025
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు ప్రవేశించింది.

    ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన పంజాబ్‌ 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

    శ్రేయస్ అయ్యర్‌ మేజిక్

    ఈ గెలుపులో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ కీలకపాత్ర పోషించాడు. అతడు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    ఈ విజయంతో శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.

    మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిచి, వాటిని ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

    Details

    మూడు జట్లకు ఫైనల్ టికెట్

    2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు

    2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు

    2025లో పంజాబ్ కింగ్స్‌కు ఫైనల్ బరిలోకి దారి చూపించాడు.

    రెండో అరుదైన రికార్డు

    కెప్టెన్ శ్రేయస్ మాత్రమే కాదు, పంజాబ్‌ కింగ్స్‌ కోచ్ రికీ పాంటింగ్ కూడా అరుదైన ఘనత సాధించాడు.

    మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి ప్రధాన కోచ్‌గా తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు.

    2015లో ముంబై ఇండియన్స్

    2020లో ఢిల్లీ క్యాపిటల్స్

    2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

    Details

    ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు

    ఇక డేనియల్ వెట్టోరి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌లు ఇప్పటికే కోచ్‌గా రెండేసి జట్లను మాత్రమే ఫైనల్‌కు తీసుకెళ్లారు.

    ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లు ముగిసే సరికి ఛేదించి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

    ఈ విజయం పంజాబ్ కింగ్స్‌కు మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్‌, రికీ పాంటింగ్‌లకు కూడా ఐపీఎల్‌లో మైలురాయిగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రేయస్ అయ్యర్
    ఐపీఎల్

    తాజా

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు శ్రేయస్ అయ్యర్
    Stock Market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 24,551  స్టాక్ మార్కెట్
    Gold Rate: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి తులం రేటు ఎంతంటే?  బంగారం
    Nellore: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి! నెల్లూరు నగరం

    శ్రేయస్ అయ్యర్

    ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం క్రికెట్
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? క్రికెట్
    టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..! క్రికెట్
    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ క్రికెట్

    ఐపీఎల్

    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  పాకిస్థాన్
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025