
IPL 2025: ముంబయి ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానం కైవసం చేసుకున్న పంజాబ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18లో భాగంగా ముంబయితో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ విజయంతో పంజాబ్ జట్టు లీగ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు నమోదు చేసింది.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్,18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
పంజాబ్ తరఫున జోష్ ఇంగ్లిస్ 73 పరుగులు,ప్రియన్ష్ ఆర్య 62 పరుగులు చేశారు.
ఈ విజయంతో పంజాబ్ జట్టు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్కు అర్హత పొందగా,ముంబయి జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఈ మ్యాచ్తో పాటు ఇరు జట్లు తమ లీగ్ దశను ముగించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంబయి ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్
Punjab Kings win by 7 Wickets #PBKSvsMI #PBKSvMI #IPL2025 #MIvsPBKS #MIvPBKS #Lahore #SuryakumarYadav pic.twitter.com/QlBnDfGWgh
— RO_KO 🏏 (@MohammadFa83199) May 26, 2025