Page Loader
Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 
Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి

Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఫిబ్రవరి 26 అర్థరాత్రి తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్నియాలోని బిలౌరీ పనోరమా హైట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తేజస్వి యాదవ్‌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కారు అదుపు తప్పి డివైడర్‌ను ధ్వంసం చేసి.. అవతలి లేన్‌లో ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అవతివైపు కారులో కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం GMCHలో చేర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు