NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్
    తదుపరి వార్తా కథనం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్
    పశ్చిమ బెంగాల్‌లో నలుగురికి బీఎఫ్-7 వేరియంట్

    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

    వ్రాసిన వారు Stalin
    Jan 05, 2023
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

    ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఈ నలుగురి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. దీంతో వీరిలో బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలినట్లు ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి వివరించారు.

    బీఎఫ్-7 వేరియంట్ సోకిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరిది నాడియా జిల్లా. మరొకరు బిహార్‌కు చెందిన వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారు.

    కరోనా

    సన్నిహితంగా ఉన్న 33మంది గుర్తింపు

    బీఎఫ్-7 వేరియంట్ సోకిన నలుగురితో సన్నిహితంగా ఉన్న 33మందిని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వారి నమూనాలను పరీక్షలకు పంపినట్లు వివరించారు. అందరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

    చైనాతో పాటు ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలను కేంద్ర తప్పని సరి చేసింది. డిసెంబర్ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే కోల్‌కతా విమానాశ్రయంలో కరోనా పరీక్షలు చేసి.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఈ క్రమంలోనే నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలింది.

    వారం రోజుల క్రితం కూడా కోల్‌కతా విమానాశ్రయంలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి చైనా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025