Page Loader
శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో
భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

వ్రాసిన వారు Stalin
Mar 26, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు ఎల్వీఎం3ని ప్రయోగించారు. 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువు ఉన్న ఎల్‌వీఎం3 రెండో లాంచ్ ప్యాడ్ రాకెట్ పోర్ట్ నుంచి 36 మొదటి జనరేషన్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

ఇస్రో

దశలవారీగా వేరుకానున్న ఉపగ్రహాలు

రాకెట్ టేకాఫ్ అయిన 19 నిమిషాల తర్వాత ఉపగ్రహ విభజన ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. 36 ఉపగ్రహాలను వేరుచేయడం దశలవారీగా జరుగుతుందని తెలియజేశారు. ఈ ప్రయోగంతో యూకేతో పాటు భారతీయ అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకారం మరి బలపడుతుందని ఈ మిషన్ భాగస్వామి అయిన వన్‌వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ ట్విట్టర్‌లో పేర్కొంది. 2022లో అక్టోబర్ 23న యూకేకు చెందిన వన్‌వెబ్ సంస్థకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.