NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష
    తదుపరి వార్తా కథనం
    560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష
    మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు జైలు శిక్ష

    560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష

    వ్రాసిన వారు Stalin
    Jan 05, 2023
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

    కొలోరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో మేగస్ హెస్(46) అనే మహిళ.. శ్మశాన వాటికతో పాటు అవయవదాన కార్యక్రమాలను నిర్వహించేది. మేగస్ హెస్‌కు ఆమె తల్లి షిర్లే కోచ్ కూడా సహకరిస్తూ ఉండేది.

    తల్లీకూతుళ్లు సంపాదన మీద మోజుతో.. మృతదేహాల అవయవాలను అక్రమంగా విక్రయించడం మొదలు పెట్టారు. మృతదేహాల బంధువులే అవయవదానం చేస్తున్నట్లుగా నకలీ పత్రాలను సృష్టించి.. ఈ అక్రమానికి పాల్పడ్డారు.

    అమెరికా

    విచిత్రంగా భుజాలు, వెన్నుముక కూడా అమ్మేశారు

    కొన్నాళ్లకు తల్లీకూతుళ్లు దందా బయటపడింది. మీడియా కూడా వీరిపై వరుస పరిశోధనాత్మక కథనాలు రాసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ తల్లీకూతుళ్లు స్థావరాలపై దాడి చేయడంతో మరిన్ని విషయాలు వెలుగలోకి వచ్చాయి.

    వీరు కళ్లు, కిడ్నీ, లివర్ వంటి అవయవాలనే కాకుండా.. విచిత్రంగా భుజాలు, వెన్నుముక, మోకాళ్లు, పాదలను విక్రయించినట్లు తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అనంతరం తల్లీకూతుళ్లను అరెస్టు చేశారు. అరెస్టు అయ్యే నాటికే వీరు దాదాపు 560శవాలకు సంబంధించిన అవయవాలను విక్రయించినట్లు పోలీసులు చెప్పారు.

    పోలీసుల విచారణలో తల్లీకూతుళ్లు నేరాన్ని అంగీకరించారు. ఈ దారుణానికి పాల్పడ.. మేగస్ హెస్‌కు 20ఏళ్లు, ఆమె తల్లికి 15ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ.. ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025