Loading...
Electric Cars: లగ్జరీ కార్లలో ఈవీల జోరు.. సంపన్నుల్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్
లగ్జరీ కార్లలో ఈవీల జోరు.. సంపన్నుల్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్

Electric Cars: లగ్జరీ కార్లలో ఈవీల జోరు.. సంపన్నుల్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంపన్న భారతీయ కార్ల కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. సాధారణ కార్ల మార్కెట్‌తో పోలిస్తే లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మార్పు చాలా వేగంగా జరుగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో భారత్‌లో విక్రయించిన ప్రతి నాలుగు బీఎండబ్ల్యూ కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే. ఈ జర్మన్ లగ్జరీ కార్ల సంస్థలో ఈవీల వాటా సాధారణ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఈవీల వాటా సుమారు 8-9 శాతంగా ఉంది.

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

మెర్సిడెస్ బెంజ్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది.

2026 తొలి ఆరు నెలల్లో రూ.1.4 కోట్లకు పైగా ధర ఉన్న 'టాప్ ఎండ్' విభాగంలో ప్రతి మూడు గంటలకు ఒక బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (BEV) కంపెనీ విక్రయించింది.

రూ.57 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన మెర్సిడెస్ CLA BEVకు 2026 ఏడాదికి కేటాయించిన మొత్తం యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.

దీంతో కొత్తగా కొనుగోలు చేసేవారు వచ్చే ఏడాది వరకు డెలివరీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

ఈ పరిణామం యాదృచ్ఛికం కాదని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సాధారణ భారతీయ కార్ల కొనుగోలుదారులను ఈవీల విషయంలో వెనుకడుగు వేయిస్తున్న ప్రధాన సమస్యలు.. ఛార్జింగ్ సౌకర్యం, మధ్యలో బ్యాటరీ అయిపోతుందనే ఆందోళన, అధిక ప్రారంభ ధర. అయితే సంపన్న కుటుంబాలకు ఇవే అంశాలు పెద్దగా ఇబ్బంది కలిగించడం లేదు.

"లగ్జరీ విభాగంలో ఈవీల వినియోగం ఎక్కువగా ఉండటానికి కారణం వాటికి పెద్దగా అడ్డంకులు లేకపోవడమే. ఈ కొనుగోలుదారులకు ఇంట్లోనే ఛార్జర్ ఏర్పాటు చేసుకునే అవకాశం, ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉంటాయి. అందువల్ల ఛార్జింగ్ సమస్యగా మారదు" అని ఎల్‌వీపీ ఫోర్‌కాస్టింగ్ మొబిలిటీ గ్లోబల్ అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగాల్ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

"ఈవీ సాధారణంగా వారి దగ్గర ఉన్న ఏకైక కారు కాదు. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో బ్యాటరీ పరిధి గురించి ఆందోళన ఉండదు. అంతేకాకుండా పెట్రోల్ లేదా డీజిల్ లగ్జరీ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లపై పన్ను భారం తక్కువ. దీంతో సాధారణ కొనుగోలుదారులను వెనక్కి తగ్గించే ధర వ్యత్యాసం ఇక్కడ పెద్ద సమస్యగా ఉండదు" అని ఆయన వివరించారు.

సంపన్నుల కార్ల వినియోగంలో ఉన్న ఈ తేడా ఇప్పుడు విక్రయ గణాంకాల్లోనూ కనిపిస్తోంది.

సంప్రదాయ లగ్జరీ కార్ల విక్రయాల వృద్ధి మందగించినప్పటికీ, ఈవీలు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ సంస్థలకు వేగంగా పెరుగుతున్న కొత్త వినియోగదారుల వర్గాన్ని అందిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

2026 తొలి ఆరు నెలల్లో మెర్సిడెస్ బెంజ్ BEVలను మినహాయిస్తే విక్రయాలు కేవలం 2.3 శాతం పెరిగాయి.

బీఎండబ్ల్యూ నాన్-BEV విక్రయాలు 5 శాతం పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లను కూడా కలిపితే మెర్సిడెస్ మొత్తం విక్రయాల వృద్ధి 9 శాతానికి, బీఎండబ్ల్యూ వృద్ధి 17 శాతానికి చేరింది.

దీంతో లగ్జరీ కార్ల మార్కెట్‌లో ఈవీలు కేవలం మరో రకం ఇంజిన్ ఎంపికగా మిగలడం లేదు.

కంపెనీలకు అదనపు విక్రయాలు, వృద్ధిని అందించే ముఖ్యమైన విభాగంగా మారుతున్నాయి.

బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్‌దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. ఈవీల ఆకర్షణ కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాదన్నారు.

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

"ఈవీలు కాలుష్య ఉద్గారాలు లేని వాహనాలు మాత్రమే కాదు. పనితీరులో ఎలాంటి రాజీ లేకుండా స్థిరమైన రవాణాను అందిస్తాయి. అంతేకాకుండా నిర్వహణ, వినియోగం, పన్నుల పరంగా ఖర్చులు గణనీయంగా తక్కువగా ఉంటాయి" అని బ్రార్ చెప్పారు.

ఇంధనంపై ఆదా పెద్దగా ప్రభావం చూపని స్థాయి ధర ఉన్న కార్లలోనూ ఈవీలకు డిమాండ్ పెరుగుతుండటం విశేషం.

మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఈక్యూఎస్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.1.4 కోట్లు కాగా, ఈక్యూఎస్ మేబ్యాక్ ఎస్‌యూవీ ధర రూ.2.4 కోట్లు. G580 ధర సుమారు రూ.3.1 కోట్లు. 2026 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఈ విభాగం విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగాయి.

వివరాలు 

సంపన్న వినియోగదారుల్లో ఈవీలకు డిమాండ్

లగ్జరీ మార్కెట్‌లో కొంత అందుబాటు ధర ఉన్న విభాగంలోనూ ఈవీలకు ఆదరణ పెరిగింది.

మెర్సిడెస్ CLA BEVకు 2026కు కేటాయించిన మొత్తం కార్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.

"CLA BEV పూర్తిగా అమ్ముడవడం, ముఖ్యంగా రూ.61 లక్షల ధర ఉన్న టాప్ ఎండ్ 250+ వేరియంట్లకు వచ్చిన డిమాండ్.. లగ్జరీ ఈవీ కొనుగోలుదారుల్లో పెరుగుతున్న పరిణతిని చూపిస్తోంది. వీరు కేవలం ధరను కాకుండా సాంకేతికత, విలువ, లగ్జరీ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు.

వివరాలు 

అడ్డంకులు తగ్గుతున్నాయి

లగ్జరీ కారు కొనుగోలుదారుల జీవన విధానం, ఈవీలను ఎంచుకునే విషయంలో వారు సాధారణ మార్కెట్ కంటే ఎందుకు ముందున్నారో వివరిస్తుంది.

ఒక కుటుంబం ఒక్క కారునే కొనుగోలు చేస్తే.. ఈవీ తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు.

అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి ప్రత్యేక ఛార్జర్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోవచ్చు.

దూర ప్రయాణాలకు వెళ్లాలంటే మార్గమధ్యంలో ఛార్జింగ్ సౌకర్యాలను ముందుగానే చూసుకోవాలి.

ఈవీ అధిక ప్రారంభ ధరను కూడా భవిష్యత్తులో ఇంధనంపై ఆదాతో పోల్చి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే సంపన్న కుటుంబాల విషయంలో ఈ లెక్కలు చాలా వరకు మారిపోతాయి.

ప్రత్యేక పార్కింగ్ స్థలం ఉండటంతో ఇంట్లోనే ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం సులభం.

వివరాలు 

అడ్డంకులు తగ్గుతున్నాయి

దీంతో పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాత్రిపూట కారును ఛార్జ్ చేసుకోవచ్చు.

అంతకంటే ముఖ్యంగా.. సంపన్న కుటుంబాల్లో ఈవీ సాధారణంగా ఉన్న అనేక కార్లలో ఒకటిగా ఉంటుంది.

అందువల్ల కుటుంబంలోని అన్ని ప్రయాణ అవసరాలను ఆ ఒక్క ఎలక్ట్రిక్ కారు తీర్చాల్సిన అవసరం ఉండదు.

నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఈవీని ఉపయోగించుకోవచ్చు. దూర ప్రయాణాల కోసం మరో పెట్రోల్ లేదా డీజిల్ కారు అందుబాటులో ఉంటుంది.

దేశంలోని పన్నుల విధానం కూడా ఈవీలకు అనుకూలంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై 5 శాతం జీఎస్టీ ఉంటుంది.

అదే పెద్ద పెట్రోల్, డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ కూడా ఉంటుంది.

వివరాలు 

అడ్డంకులు తగ్గుతున్నాయి

లగ్జరీ కార్ల ధరలు ఎక్కువగా ఉండటంతో పన్నుల్లోని ఈ వ్యత్యాసం బ్యాటరీ టెక్నాలజీ వల్ల పెరిగే అదనపు ఖర్చును కొంతవరకు భర్తీ చేస్తుంది.

దీంతో ఎలక్ట్రిక్,పెట్రోల్,డీజిల్ కార్ల మధ్య ధర వ్యత్యాసం కూడా తగ్గుతుంది.

లగ్జరీ కార్లకు సహజంగా సరిపోయే మరికొన్ని ప్రత్యేకతలను కూడా ఈవీలు అందిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ మోటార్లు వెంటనే టార్క్‌ను అందిస్తాయి.అంతర్గత దహన ఇంజిన్ లేకపోవడంతో కారులో శబ్దం తక్కువగా ఉంటుంది.

సాధారణ ప్రీమియం కార్లలో ఈ స్థాయి నిశ్శబ్దం,సౌకర్యం కోసం తయారీదారులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు.

అందువల్ల అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారికి ఎలక్ట్రిక్ వాహనం తక్కువ పన్నులు, తక్కువ నిర్వహణ ఖర్చులతో పాటు మంచి పనితీరు,ఆధునిక సాంకేతికత, కొత్తదనం వంటి ప్రయోజనాలను అందిస్తోంది.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

సంపన్న భారతీయులు ఈవీల వైపు మళ్లడానికి మరో ప్రధాన కారణం.. మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరగడం. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లోని లగ్జరీ కార్ల విభాగంలో 13 కొత్త BEV మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.

పోర్షే, వోల్వో, రోల్స్ రాయిస్, ఫెరారీ, లెక్సస్ వంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. వీటిలో కొన్ని కార్ల ధరలు దాదాపు రూ.5 కోట్ల వరకు ఉన్నాయి.

దీంతో ఈవీలను ఎంచుకునే విషయంలో ఉన్న మరో అడ్డంకి కూడా క్రమంగా తొలగిపోతోంది.

గతంలో లగ్జరీ ఈవీ కొనుగోలుదారులకు చాలా పరిమితమైన మోడళ్లే అందుబాటులో ఉండేవి.

అదే సమయంలో పెట్రోల్, డీజిల్ విభాగంలో అనేక సెడాన్లు, ఎస్‌యూవీలు, అధిక పనితీరు కలిగిన కార్లు ఉండేవి.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

దీని ప్రభావం పరిశ్రమ గణాంకాల్లోనూ కనిపిస్తోంది

ఇప్పుడు తమకు నచ్చిన బాడీ స్టైల్,పనితీరు,లగ్జరీ బ్రాండ్‌ను వదులుకోకుండానే ఎలక్ట్రిక్ మోడల్‌ను ఎంచుకునే అవకాశం పెరిగింది.

2026 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో లగ్జరీ కార్ల వాటా కేవలం 1.1-1.2శాతం మాత్రమే.

అయితే దేశంలోని BEV విక్రయాల్లో వాటి వాటా సుమారు 2.5-2.7శాతంగా ఉంది.

అంటే మొత్తం కార్ల మార్కెట్‌లో లగ్జరీ కార్ల వాటా కంటే ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో వాటి వాటా రెండింతలకుపైగా ఉంది.

బీఎండబ్ల్యూ గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో సంస్థ 2,359ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

అంటే భారత్‌లో సంస్థ విక్రయించిన కార్లలో దాదాపు నాలుగో వంతు ఈవీలే. ఇదే కాలంలో మెర్సిడెస్ బెంజ్ 859BEVలను విక్రయించింది.

అయితే లగ్జరీ ఈవీల మార్కెట్ పెరుగుతున్నంత మాత్రాన ప్రతి ప్రీమియం ఈవీ కంపెనీకి ఇదే స్థాయిలో విక్రయాలు వస్తున్నాయని చెప్పలేం.

టెస్లా అనుభవమే ఇందుకు ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలతో గుర్తింపు పొందిన టెస్లా.. 2026 జూన్‌తో ముగిసిన భారత్‌లో తన తొలి ఏడాదిలో కేవలం 450 కార్లను మాత్రమే విక్రయించింది.

దీనికి పరిమితమైన మోడల్ ఎంపిక ఒక కారణం. ప్రస్తుతం టెస్లా భారత్‌లో కేవలం Model Yను మాత్రమే విక్రయిస్తోంది.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

దీంతో సెడాన్లు, వివిధ రకాల ఎస్‌యూవీలు, అధిక పనితీరు కలిగిన కార్లు అందించే ఇతర లగ్జరీ కార్ల కంపెనీలతో పోలిస్తే టెస్లాకు ఎంపికలు తక్కువగా ఉన్నాయి. ధర కూడా మరో సవాలుగా మారింది.

టెస్లా భారత్‌లో బేస్ Model Yను తొలుత రూ.59.89 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు విడుదల చేసింది. 2026 మేలో ధరను రూ.50.89 లక్షలకు తగ్గించింది.

ధర తగ్గించినప్పటికీ పూర్తిగా దిగుమతి చేసుకున్న ఈ కారు.. విస్తృతమైన మోడల్ శ్రేణి, ఇప్పటికే ఏర్పాటైన విక్రయ,సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది.

భారత్‌లో లగ్జరీ ఈవీల మార్కెట్ ఎలా మారుతోందో ఈ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

సాధారణ కార్ల కొనుగోలుదారులకు ఈవీ కొనడం అంటే ఇప్పటికీ ఛార్జింగ్, ప్రయాణ పరిధి,ప్రారంభ ధర,ఒక్క కారుపైనే ఆధారపడటం వంటి అంశాల్లో కొన్ని రాజీలను అంగీకరించాల్సి రావచ్చు.

కానీ సంపన్న కుటుంబాలకు వీటిలో చాలా సమస్యలను సులభంగా అధిగమించే అవకాశం ఉంది.

ఇంట్లో ఛార్జర్ ఏర్పాటు చేసుకోవచ్చు. దూర ప్రయాణాలకు మరో కారు ఉపయోగించుకోవచ్చు.

తక్కువ పన్నుల కారణంగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం కూడా సాపేక్షంగా తక్కువ భారంగా మారుతుంది.

వివరాలు 

ఎంపికలు పెరుగుతున్నాయి

దీంతో సంపన్న భారతీయుల ఇళ్లలో ఎలక్ట్రిక్ లగ్జరీ కారు ఖరీదైన ప్రయోగం అనే స్థాయి నుంచి సాధారణ ఎంపికగా మారుతోంది.

బీఎండబ్ల్యూ,మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీల విషయంలో ఈ మార్పు మరో అడుగు ముందుకు వెళ్లింది.

భారత్‌లో ఈవీలు ఇక భవిష్యత్తు ఉత్పత్తి వ్యూహంలో భాగం మాత్రమే కాదు.. ప్రస్తుతం కంపెనీల వృద్ధికి కూడా కీలకంగా మారుతున్నాయి.

ADVERTISEMENT