NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
    అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం సూచీలు దూసుకుపోయాయి.

    గతంలో నష్టాల్లో ఉన్న మార్కెట్ ప్రధాన షేర్ల కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,ఎస్‌బీఐ షేర్ల రాణింపు మార్కెట్‌ను లాభాల దిశగా నడిపింది.

    ప్రారంభంలోనే సెన్సెక్స్ 470 పాయింట్లు పెరిగి,నిఫ్టీ 23,300 మార్కును దాటింది.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 77,131 వద్ద,నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 23,338 వద్ద ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్స్‌, జొమాటో, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    అదే సమయంలో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, టైటాన్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.27 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,724 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి-డాలర్ మారకం విలువ 86.42 వద్ద ఉంది.

    బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా, నాస్‌డాక్ 2 శాతం, ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్ 1 శాతం పెరిగాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు లాభాల్లో ట్రేడవుతుండగా, విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.4,533 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,683 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు! కమల్ హాసన్
    Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్ మార్కెట్
    #NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్‌ పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..? ఉమీద్‌ పోర్టల్‌
    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. రెండేళ్ల తర్వాత ఈ వారమే అతి పెద్ద భారీ పతనం బిజినెస్
    Multibaggar stock : మీరు కొన్నారా..?.. 5ఏళ్లలో 26000శాతం పెరిగిన స్టాక్! టాటా మోటార్స్
    Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700 బిజినెస్
    Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025