NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 
    తదుపరి వార్తా కథనం
    Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 
    Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే

    Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2023
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బేగంపేటలోని ప్రజాభవన్‌ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

    ఈ కేసులో విచారణ సమయంలో కొత్త కోణాలు వెలుగు చూస్తుండటం గమనార్హం.

    ప్రజాభవన్‌ ఎదుట కారు సృష్టించిన బీభత్సానికి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

    ఈ కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

    ఇది వరకు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారనే నెపంతో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును సీపీ శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు.

    ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో సొహైలే ప్రధాన నిందితుడని, విచారణను పక్కదారి పట్టించేందుకు తమ పనిమనిషిని స్టేషన్‌కు పంపారని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

    ప్రజాభవన్

    ఈ కేసులో అసలేమైంది?

    ఈనెల 23న అర్ధరాత్రి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు సాహిల్‌ తన కారులో ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకుని అతివేగంతో కారు నడుపుతూ.. ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు.

    అనంతరం ట్రాఫిక్ పోలీసులు..కారు నడిపిన సాహిల్‌ సహా ముగ్గురు యువతులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

    బ్రీత్ ఎనలైజర్‌ పరీక్ష చేసే సమయంలో సాహిల్‌ను తప్పించుకొని పారిపోయాడు.

    వెంటనే సాహిల్ ఈ విషయాన్ని దుబాయ్‌లో ఉన్న తన తండ్రికి చెప్పారు.

    ఈ క్రమంలో రంగంలోకి దిగిన షకీన్ అనుచరులు సాహిల్‌ను తప్పించారు.

    ఆ కారు నడిపింది సాహిల్ పనిమనిషి అబ్దుల్‌ ఆసిఫ్‌ అని అతడిని 28వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆసిఫ్‌‌పై కేసును నమోదు చేశారు.

    ప్రజాభవన్

    సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాక.. 

    అయితే ప్రమాదం జరిగిన రోజు వాగ్మూలం ఇచ్చింది.. అబ్దుల్‌ ఆసిఫ్‌ కాదని పోలీసులు గుర్తించారు.

    ఆ రోజు కారు నడిపింది సాహిల్‌గా నిర్ధారించారు. డీసీపీ విజయ్‌కుమార్‌ మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

    బేగంపేట, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు.

    ఈ మేరకు లభించిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన తర్వాత.. ఆ రోజు కారు నడిపింది సాహిల్‌గా గుర్తించారు.

    ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌ అని నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    అలాగే, సాహిల్‌పై మరి కొన్ని కేసుల్లోనూ పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఆ కేసుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ

    హైదరాబాద్

    అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా అమిత్ షా
    ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా టాలీవుడ్
    Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే  తలసాని శ్రీనివాస్ యాదవ్
    Mahesh Babu, Ram Charan: బొమ్మ అదుర్స్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబాలు  రామ్ చరణ్

    తాజా వార్తలు

    Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి  డ్రోన్
    Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా? జగిత్యాల
    కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025