NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ
    తదుపరి వార్తా కథనం
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ
    జనవరి1, 2024 నాటికి రామమందిరం సిద్ధం: అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

    త్రిపురలో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయ సాధిస్తుందన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

    ఫిబ్రవరిలో త్రిపుర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బీజేపీ ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 'రథయాత్ర'ను చేపట్టింది.

    అమిత్ షా

    లెఫ్ట్ ఫ్రంట్‌పై విమర్శనాస్త్రాలు

    త్రిపురలో గతంలోని సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ పరిపాలన అంతా లెఫ్ట్ కేడర్ నియంత్రణలో ఉండేదని, ప్రతి అంశానికి ప్రజలు సీపీఎం నేతల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు.

    ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి.. 1,000 కి.మీ ప్రయాణించిన తర్వాత.. ఈ రథయాత్ర జనవరి 12న అగర్తలాలో ముగుస్తుంది. ఆ సమయంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే అవకాశం ఉంది.

    రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందిని నేరుగా కలవడానికి 'జన విశ్వాస యాత్ర' పేరుతో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు త్రిపుర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ తెలిపారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025