NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?
    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?

    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    Jan 21, 2024
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    101 kg of gold to Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరం సోమవారం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

    రామమందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తలు తమ శక్తికి మేరకు విరాళాలను అందజేశారు.

    ఈ క్రమంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అయోధ్య రామాలయానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. రామాలయానికి 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.

    ఆ దాత ఎవరో కాదు.. దిలీప్ కుమార్ వి.లఖి సూరత్‌లోని అతిపెద్ద డైమండ్ ఫ్యాక్టరీ యజమాని.

    అతను రామాలయంలో అమర్చిన 14 బంగారు పూతతో ఉన్న తలుపుల కోసం 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.

    రామజన్మభూమి ట్రస్ట్‌కి అందిన అతిపెద్ద విరాళం ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు.

    అయోధ్య

    రూ.3వేల కోట్లు దాటిన విరాళాలు

    రామజన్మభూమి గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, స్తంభాలకు పాలిష్ చేయడానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.

    గర్భగుడి ప్రవేశ ద్వారంతో పాటు ఆలయ కింది అంతస్తులో 14 బంగారు ద్వారాలను ఏర్పాటు చేశారు.

    రెండో అతిపెద్ద విరాళాన్ని మొరారీ బాపు అనుచరులు అందించారు. రామ మందిరానికి రూ.16.3 కోట్లు ఇచ్చారు.

    ఇది కాకుండా, సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ధోలాకియా శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడు గోవింద్‌భాయ్ ధోలాకియా ఆలయానికి 11 కోట్ల రూపాయలను అందజేశారు.

    మార్చి 2023నాటికి రామమందిరానికి రూ.3 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.

    ఆలయంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణానికి సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.

    మిగతా పనులు పూర్తయ్యే వరకు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    సూరత్
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అయోధ్య

    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? ఎయిర్ ఇండియా
    Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు  ఉత్తర్‌ప్రదేశ్
    Ram Mandir: అయోధ్య రాముడి కోసం 108 అడుగుల అగరబత్తి  భారతదేశం
    Cm Yogi : నేడు అయోధ్యకి సీఎం యోగి..ప్రధాని మోదీ పర్యటనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్లు యోగి ఆదిత్యనాథ్

    సూరత్

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్  తెలంగాణ
    PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    India - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే  భారతీయ విద్యార్థుల సంఖ్య  కెనడా
    Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు మహువా మోయిత్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025