NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!
    తదుపరి వార్తా కథనం
    మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!
    మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్!

    మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

    2021వరకు అమరీందర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనూహ్యాంగా అధిష్టానం అమరీందర్ సింగ్‌ను సీఎం పదవినుంచి తప్పించింది. మనస్థాపానికి గురైన అమరీందర్ కాంగ్రెస్‌ను వీడారు. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్‌' పార్టీని అమరీందర్ స్థాపించారు. గతేడాది సెప్టెంబర్‌లో తన పార్టీని బీజేపీలో విలీనం చేయగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా సింగ్‌ను పార్టీ నియమించింది.

    మహారాష్ట్ర

    గవర్నర్ పదవినుంచి వైదొలగడానికి కోష్యారీ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా?

    తాను త్వరలోనే గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ తెలియజేసిన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపిక అనివార్యమైంది.

    గవర్నర్‌గా కోష్యారీ అనేక వివాదాల్లో చిక్కకున్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే కోష్యారీ పదవినుంచి వైదొలగడానికి కారణంగా తెలుస్తోంది.

    శివాజీ పాతతరం నాయకుడని కోష్యారీ అనడం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. గవర్నర్‌గా కొశ్యారీని రీకాల్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

    అంతేకాకుండా గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే ముంబయికి రెవెన్యూ ఉండదని కోష్యారీ అన్న మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఉద్ధవ్ థాకరే, కోష్యారీకి కొల్హాపురి చెప్పులను చూపించాలని పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    గవర్నర్
    బీజేపీ

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? ధర్మపురి
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025