Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
వ్రాసిన వారు
Stalin
Dec 13, 2023
05:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది. 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని శామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఆ భూములను రాత్రికి రాత్రే రిజిస్టర్ చేయించుకున్నారని గిరిజనులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు తహసీల్దార్తో పాటు, మల్లారెడ్డిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి