Page Loader
NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు
కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్‌కు 872.07 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులతో, కడప జిల్లాలోని చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద తీసుకువెళ్ళే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐసీసీ) ఆధ్వర్యంలో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును, ఇకనుంచి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ (ఎన్ఐసిడిఐటీ) క్రిందికి బదిలీ చేయనున్నారు.

Details

కొప్పర్తిలో మౌలిక వసతుల నిర్మాణం

2595.40 ఎకరాల భూములను, ఎపీఐసీసీ నుండి ఎన్ఐసిడిఐటికి బదలాయించనున్నారు. ఈ భూముల బదలాయింపుకు సంబంధించిన 65.40 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మొత్తాన్ని రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద చెల్లించాల్సిన అవసరం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. భూముల బదలాయింపు అనంతరం, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ రూ. 872.07 కోట్లతో కొప్పర్తిలో మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభించనుంది. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.