NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు
    తదుపరి వార్తా కథనం
    NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు
    కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

    NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.

    నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్‌కు 872.07 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

    ఈ నిధులతో, కడప జిల్లాలోని చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద తీసుకువెళ్ళే చర్యలు చేపట్టారు.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐసీసీ) ఆధ్వర్యంలో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును, ఇకనుంచి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ (ఎన్ఐసిడిఐటీ) క్రిందికి బదిలీ చేయనున్నారు.

    Details

    కొప్పర్తిలో మౌలిక వసతుల నిర్మాణం

    2595.40 ఎకరాల భూములను, ఎపీఐసీసీ నుండి ఎన్ఐసిడిఐటికి బదలాయించనున్నారు.

    ఈ భూముల బదలాయింపుకు సంబంధించిన 65.40 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

    ఈ మొత్తాన్ని రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద చెల్లించాల్సిన అవసరం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

    భూముల బదలాయింపు అనంతరం, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ రూ. 872.07 కోట్లతో కొప్పర్తిలో మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభించనుంది.

    ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Children's Day: భారత రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బాలల దినోత్సవం
    Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇండియా
    Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్‌ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..! బిజినెస్

    ఆంధ్రప్రదేశ్

    APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ భారతదేశం
    Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు చంద్రబాబు నాయుడు
    Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే! సంక్రాంతి స్పెషల్
    Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025