NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ
    భారతదేశం

    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ

    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 21, 2022, 04:43 pm 1 నిమి చదవండి
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ
    కరోనా ప్రోటోకాల్‌ పాటించాలని రాహుల్‌కు కేంద్రం లేఖ

    'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది. అయితే కరోనా నిబంధనల మేరకే రాహుల్ కి లేఖ పంపినట్లు బీజేపీ చెబుతుండగా.. భారత్ జోడో యాత్ర'కు వస్తున్న ప్రజాదరణను చూసి కాషాయపార్టీ ఓర్వలేక పోతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాహల్ పాదయాత్రకు వస్తున్న ప్రజలను చూసి.. ప్రధాని మోదీ భయపడుతున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు.

    'రాజకీయ ఉద్దేశంతోనే లేఖ రాశారు'

    రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'కు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే మాండవీయ లేఖ రాసినట్లు కనిపిస్తోందని సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు. ఇది ప్రజల కోసం రాసిన లేఖలా లేదని, బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాసిన ఉత్తరంగా ఉందని విమర్శించారు. రెండు రోజులు క్రితం త్రిపురలో మోదీ ర్యాలీల్లో ఎలాంటి కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించలేదన్నారు. రెండో వేవ్ సమయంలో కూడా, పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించినట్లు గెహ్లోత్ గుర్తు చేశారు. ఈ లేఖలో ఆరోగ్యమంత్రి రాజకీయ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాండవీయ ఒకవేళ రాస్తే.. మొదట ప్రధాని మోదీకి రాసి.. ఆ తర్వాత రాహుల్‌కు రాయాల్సిందని ఎద్దేవా చేశారు. మంగళవారం వరకు రాహుల్ యాత్ర రాజస్థాన్‌లోనే సాగింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023