Loading...
Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు

Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై పోర్టులో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. కార్గోను ఓడ నుంచి బయటకు తీస్తుండగా ఓ భారీ క్రేన్ అదుపు తప్పి పక్కనే ఉన్న నౌకను ఢీకొంది. ఈ ఘటనతో క్రేన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు గాయపడ్డారు. భారీ కార్గోను లేపుతుండగా.. ఆదివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ముంబై పోర్టులో 'వియన్నా' అనే ఓడ నుంచి భారీ కార్గోను తరలించే పనులు చేపట్టారు. ఇందుకోసం రెండు క్రేన్లను ఉపయోగించారు. సుమారు 140 మెట్రిక్ టన్నుల బరువున్న కార్గోను ఈ రెండు క్రేన్ల సాయంతో పైకి లేపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాలు 

ఒక్కసారిగా అదుపు తప్పిన క్రేన్

కార్గోను పైకి తీస్తున్న సమయంలో ఒక క్రేన్‌కు అమర్చిన బెల్ట్ బ్యాలెన్స్ తప్పి ఊడిపోయింది.

దీంతో 140 మెట్రిక్ టన్నుల బరువున్న కార్గో మొత్తం ఒక్కసారిగా రెండో క్రేన్‌పై పడింది. భారీ బరువు పడటంతో దాన్ని మోయలేక రెండో క్రేన్ వెనుక భాగం గాల్లోకి లేచింది.

ఓడను బలంగా ఢీకొట్టిన క్రేన్

క్రేన్ వెనుక భాగం పైకి లేవడంతో దాని ముందు భాగం వేగంగా కదిలి పక్కనే ఉన్న ఓడను బలంగా ఢీకొంది.

ఈ సమయంలో క్రేన్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పోర్టు పరిసరాల్లో ఆందోళన నెలకొంది.

వివరాలు 

ఇద్దరు ఆపరేటర్లకు గాయాలు

ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్లు రంజిత్ సింగ్, నిశాంత్ సింగ్ గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని చికిత్స కోసం ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో మంటలను అదుపులోకి..

ప్రమాదంపై సమాచారం అందుకున్న ముంబై పోర్ట్ ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టి క్రేన్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ కార్గోతో అదుపుతప్పిన క్రేన్.. ముంబై పోర్టులో ప్రమాదం

ADVERTISEMENT