NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
    'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక

    Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 08, 2025
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.

    తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న రెండోవ ప్రపంచ మహాసభల్లో ఆయన మాట్లాడారు.

    తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన గుర్తు చేశారు.

    తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించినదే కాకుండా మన భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక ఆయన స్పష్టం చేశారు.

    ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

    Details

    తెలుగు భాషపై గౌరవం పెంచుకోవాలి

    అలాగే, సినిమా సంభాషణలు కూడా తెలుగులోనే ఉండాలని సూచించారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన పూర్తిగా తప్పు అని ఆయన చెప్పారు.

    తెలుగు భాషను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, అమ్మ భాషను మరిచిపోతే అది అమ్మను మరిచిపోయినట్టేనని తెలిపారు. ఇంగ్లిష్‌ భాషను ఉపయోగించే క్రమంలో తెలుగును దిగజార్చడం మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి నివసించే ప్రజలు తెలుగులో మాట్లాడుతున్నారని, మన భాషను మనమే పట్టించుకోవడంలో వెనుకబడి పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    మన భాషపై గౌరవం ఉంచుకోవడం మన బాధ్యత" అని ఆయన వ్యాఖ్యనించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉప రాష్ట్రపతి
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    ఉప రాష్ట్రపతి

    Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ  జగదీప్ ధన్కర్

    ఆంధ్రప్రదేశ్

    Free Bus Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు.. రోజుకు రూ.6కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ భారతదేశం
    Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ భారతదేశం
    AP Fibernet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విధుల నుంచి 410 మంది తొలగింపు  భారతదేశం

    తెలంగాణ

    Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు అల్లు అర్జున్
    Balagam Mogilaiah: 'బలగం' మొగిలయ్య కన్నుమూత సినిమా
    Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్ అల్లు అర్జున్
    Hyderabad: నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్‌ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025