NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు
    ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

    TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2025
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది.

    సోమవారం జేఎన్‌టీయూహెచ్‌లో ఎప్‌సెట్‌తో పాటు పీజీఈసెట్‌, ఐసెట్‌ కమిటీల సమావేశాలు జరిగాయి.

    ఈ సమావేశాలకు జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి. డీన్‌కుమార్, కో-కన్వీనర్‌ ఆచార్య కె. విజయకుమార్‌రెడ్డి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

     Details

    రూ.500 ఫీజు చెల్లించాలి

    ఈ ఏడాది ఎప్‌సెట్‌తో సహా అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాక అధికారులు విడుదల చేసే ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలియజేయాలంటే ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు.

    నిపుణుల కమిటీ అభ్యంతరాన్ని సమర్థించిందనుకుంటే, ఫలితాల విడుదల అనంతరం డబ్బును తిరిగి చెల్లిస్తారు.

    జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి పరీక్షల్లో ఇదే విధానం కొనసాగుతోంది.

    Details

     పీజీఈసెట్, ఐసెట్‌ కమిటీ నిర్ణయాలు 

    ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ కమిటీ సమావేశంలో కన్వీనర్‌ ఏ. అరుణకుమారి, కో-కన్వీనర్‌ బి. రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్, కన్వీనర్‌ ఆచార్య అలువాల రవి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

    ఇప్పటివరకు అన్‌రిజర్వుడ్‌ కోటా 15శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు.

    రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఈ కోటా విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

    నోటిఫికేషన్‌ విడుదల సమయానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే, ప్రవేశాల సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    Details

    దివ్యాంగుల రిజర్వేషన్‌ 

    రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ జీవో విడుదల చేసింది.

    ఇప్పటివరకు మూడు కేటగిరీలు (దృష్టిలోపం, వినికిడి-మూగ, అంగవైకల్యం) ఉండగా, 3% రిజర్వేషన్‌ ఉండేది.

    - కొత్తగా మరో రెండు కేటగిరీలు చేర్చారు

    (డి) ఆటిజం వంటి మానసిక వైకల్యం.

    (ఇ) ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు.

    ప్రతి కేటగిరీకి 1శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

    అయితే వారి సీట్లు సామాజిక వర్గాల రిజర్వేషన్‌లోనే కేటాయిస్తారు.

    ఉదాహరణకు, ఒక ఆటిజం విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారయితే, ఎస్సీలకు కేటాయించిన 15శాతం రిజర్వేషన్‌లోనే సీటు పొందుతారు.

    ఈఏపీసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ, దరఖాస్తుల ప్రక్రియ, రిజర్వేషన్ విధానం, అభ్యంతరాల పరిష్కారం వంటి కీలక అంశాలను ఈ సమావేశాల్లో ఖరారు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్

    తెలంగాణ

    Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..? భారతదేశం
    New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి హైదరాబాద్
    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు భారతదేశం

    ఇండియా

    IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు మహారాష్ట్ర
    Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి అమిత్ షా
    Dense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు దిల్లీ
    Singer Abhijeet: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సింగర్ అభిజిత్‌కు లీగల్ నోటీసులు మహాత్మా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025