NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ
    భారతదేశం

    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ

    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 21, 2022, 09:20 am 1 నిమి చదవండి
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ
    జైశంకర్‌తో సమావేశమైన పిచాయ్

    టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. భారతదేశ పర్యటనలో భాగంగా పిచాయ్... సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీతో పలు కీలక అంశాలపై చర్చించారు. జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత దేశానికి వచ్చిన నేపథ్యంలో మోదీ- పిచాయ్ ఈ అంశంపై కూడా చర్చించారు.

    పిచాయ్‌తో సమావేశంపై మోదీ హర్షం

    మోదీతో సమావేశం అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో దేశంలో వేగంగా సాంకేతిక మార్పులు అమల్లోకి వస్తున్నట్లు చెప్పారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత దేశ జీ20 ప్రెసిడెన్సీకి సహకరిస్తామన్నారు. భారత దేశంతోగల బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ కూడా పిచాయ్‌తో సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ తదితర అనేక అంశాల గురించి చర్చించినట్లు ట్విట్టర్ వేదికగా చెప్పారు. సుస్థిర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా ఐపీఎల్
    ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు ప్రేరణ
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలోన్ మస్క్
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023