తదుపరి వార్తా కథనం
Road Accident: శ్రీశైలం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 23, 2025
09:00 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో ఆగి ఉన్న లారీని ఒక వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన సింగ్ పవార్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), కుసాల్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)గా పోలీసులు గుర్తించారు. వీరు శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.