Page Loader
Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో గల మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ పరిణామం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టంగా పొగ అలుముకుంది. మంటల అంటుకోవడంవలన ఆ ప్రాంతం లోని కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కారణాలను విశ్లేషిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం