NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు 
    తదుపరి వార్తా కథనం
    Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు 
    రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు

    Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

    ఛైర్మన్ సభలో ప్రతిపక్షాన్ని తక్కువగా చూడడమే కాక, అధికారపక్షానికి మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

    ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ నిర్ణయానికి ఇండియా కూటమి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం.

    ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, కానీ సభలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ లంచం వ్యవహారం ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదాలు సృష్టించడంతో సభలు అవధులతో ముందుకెళ్లడం కష్టంగా మారింది.

    ఇందుకోసం తరచుగా సమావేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

    వివరాలు 

    సభలో జరిగిన పరిణామాలపై ధన్‌కర్ మల్లిఖార్జున ఖర్గే తో చర్చ 

    మరోవైపు, అధికారపక్షం సోనియా గాంధీ, జార్జ్ సోరోస్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేస్తోంది,ఇది సభలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

    ఈ వ్యవహారంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాన్ని తక్కువగా చూస్తున్నారని ఇండియాకూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు.

    అందుకే, ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ అంశంపై ఇండియా కూటమి ఎంపీలంతా ఒకే దిశలో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇటువంటి పరిస్థితుల్లో, రాజ్యసభలో అనివార్యమైన గందరగోళాన్నిబట్టి,ఛైర్మన్ ధన్‌కర్,సభా నాయకుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను తన ఛాంబర్‌కు రావాలని ఆహ్వానించారు.

    ఈ సమావేశంలో,సభలో జరిగిన పరిణామాలపై ధన్‌కర్ చర్చించబోతున్నారు. సభ సజావుగా నడపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కూడా చర్చ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జగదీప్ ధన్కర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    జగదీప్ ధన్కర్

    Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ  ఉప రాష్ట్రపతి
    Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు రాహుల్ గాంధీ
    Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన  రాజ్యసభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025