Page Loader
Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!
మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!

Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. ఆచ్యుతాపురం మండలంలోని పూడిమడక మత్స్యకారుల వలకు రెండు కచిడి చేపలు చిక్కాయి. ఇవి పండుగకు ఒక రోజు ముందే వచ్చినట్లు ఆనందం కలిగించాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఈ చేపల విలువ రూ. 1.40 లక్షలు నమోదైంది. ఈ విలక్షణ చేపలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడినట్లు తెలుస్తోంది.

Details

కచిడి చేపలో ఔషద గుణాలు మెండు

పూడిమడకకు చెందిన వ్యాపారి ఈ చేపలను కొనుగోలు చేసి కోల్‌కతాకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు. మగ కచిడి చేపలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయని, అందువల్ల వీటిని గోల్డెన్‌ ఫిష్‌ అని పిలుస్తారు. ఈ చేపలు చాలా రుచికరంగా ఉండడమే కాకుండా, అవి ఔషధ గుణాలతో కూడా నిండి ఉంటాయని మత్స్యకారులు పేర్కొన్నారు.