NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 
    తదుపరి వార్తా కథనం
    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 
    చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!

    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2025
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది.

    ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒకే ఎంఎంటీఎస్‌ రైలు నడుస్తుండగా, ఇకపై నాలుగైదు నెలల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

    టెర్మినల్‌ నుంచి నడిపే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనుగుణంగా కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ సబర్బన్‌ రైలు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

    సోమవారం రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ ఈ వివరాలు వెల్లడించారు.

    సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను చర్లపల్లికి తరలించనున్నట్టు తెలిపారు.

    Details

    చర్లపల్లి నుంచి నడిపేందుకు సిద్ధం

    ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులను పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

    సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల కారణంగా, కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

    ఇప్పటికే చార్మినార్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను మార్చి నుంచి నడపనున్నట్లు తెలిపారు. మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

    చర్లపల్లి నుంచి నగరానికి ప్రయాణికులను చేర్చే ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ స్పష్టంచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు  భారతదేశం
    Allu Aravind: అల్లు అర్జున్ తరఫున వచ్చా.. బాధితులను ఆదుకుంటాం: అల్లు అరవింద్  అల్లు అర్జున్
    Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! భారతదేశం
    Sritej Health Bulletin: సంధ్య థియేటర్ ఘటన.. కోలుకుంటున్న శ్రేతేజ్ పుష్ప 2

    తెలంగాణ

    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు భారతదేశం
    Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు ప్రభుత్వం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025