NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
    తదుపరి వార్తా కథనం
    INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
    INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ

    INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ

    వ్రాసిన వారు Stalin
    Jan 30, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది.

    సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఫిషింగ్ ఓడ నుంచి 19మంది పాకిస్థానీ పౌరులను భారత నౌకాదళం రక్షించింది.

    భారత నౌకాదళ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర.. సాయుధ సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన ఫిషింగ్ నౌక అల్ నమీని రక్షించడం ద్వారా ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ అధికారులు తెలిపారు.

    కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు చురుకుగా పాల్గొన్నారని వెల్లడించారు.

    ఇది 'ఐఎన్‌ఎస్ సుమిత్ర' విజయంవంతంగా పూర్తి చేసిన రెండో ఆపరేషన్ కావడం గమనార్హం.

    నావికాదళం

    మొదటి ఆపరేషన్‌లో ఇరాన్ నౌకను కాపాడిన ఐఎన్‌ఎస్ సుమిత్ర 

    సోమాలియాలోని తూర్పు తీర ప్రాంతంలో ఇరాన్ జెండాతో కూడిన ఓడను ఆదివారం అర్థరాత్రి హైజాక్ చేయగా.. భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ రంగంలోకి దింగింది.

    ఇరాన్ నౌక తోపాటు అందులోని 17మంది సిబ్బందిని రక్షించింది. ఆదివారం అర్థరాత్రి హైజాకింగ్ సమాచారం అందుకున్న భారత నావికాదళం.. అరేబియా సముద్రం సమీపంలోని ఏడెన్ గల్ఫ్‌లో మోహరించిన ఐఎన్‌ఎస్ సుమిత్ర‌ను వెంటనే అలర్ట్ చేసింది.

    తక్షణమే ఇరాన్ ఫిషింగ్ ఓడ 'ఇమాన్' వైపు దూసుకెళ్లింది. అనంతరం ఇరాన్ నౌకను కాపాడి, అందులో ఉన్న 17మందిని రక్షించింది.

    ఈ సందర్భంగా భారతీయ నావికాదళ ప్రతినిధి మాట్లాడుతూ.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో యాంటీ పైరెట్స్ ఆపరేషన్‌తో పాటు సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం భారత నావికాదళ యుద్ధనౌకలను మొహరించినట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నౌకాదళం
    ఐఎన్ఎస్ వింధ్యగిరి
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నౌకాదళం

    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు సూడాన్
    భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ ట్విట్టర్
    ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన కేరళ
    హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక  శ్రీలంక

    ఐఎన్ఎస్ వింధ్యగిరి

    Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్ అరేబియా సముద్రం

    భారతదేశం

    2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా?  గూగుల్
    Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా  జో బైడెన్
    Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు  హమాస్
    'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'   గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025