NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: రెండోరోజు  అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే 
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: రెండోరోజు  అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే 
    Ayodhya: రెండోరోజూ అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే

    Ayodhya: రెండోరోజు  అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే 

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2024
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన 2 రోజుల తర్వాత కూడా భక్తులు పొటెత్తారు.

    మంగళవారం ఒక్కరోజే దాదాపు 5లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు.

    శ్రీరాముడిని దర్శించుకోలేని దాదాపు 50,000 మంది మంగళవారం రాత్రంతా ఆలయం వెలుపల గుడారాలు వేసికొని నిరీక్షించడం గమనార్హం.

    బుధవారం ఉదయం ఆలయ తలుపులు తెరిచిన వెంటనే భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు.

    భక్తుల రద్దీని నియంత్రిచడం కోసం భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం పెంచింది. దీంతో రెండో రోజు తోపులాటలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.

    భద్రతా ఏర్పాట్లను బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్, డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.

    అయోధ్య

    రెండోరోజు దర్శనానికి మరో 5లక్షల మంది

    ప్రజలు క్యూలో నిలబడి సక్రమంగా ఆలయం లోపలికి వెళ్లేందుకు వీలుగా బుధవారం బారికేడ్లు ఏర్పాటు చేశారు.

    భక్తులకు దర్శనం సజావుగా జరిగేందుకు క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం క్యూ వ్యవస్థను పటిష్టం చేసినట్లు డీజీ ప్రశాంత్ కుమార్‌ పేర్కొన్నారు.

    మంగళవారం ఒక్కరోజే స్వామివారిని దాదాపు 5 లక్షల మంది దర్శించుకొని పూజలు చేశారు.

    బుధవారం కూడా శ్రీరాముడిని 5లక్షల మంది వరకు దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టు రద్దీని నియంత్రించేందుకు కనీసం 8,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

    మంగళవారం సాయంత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని పరిశీలించేందుకు అయోధ్య చేరుకున్నారు.

    భక్తుల రద్దీ, భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమావేశమై సమీక్షించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న డీజీ ప్రశాంత్ కుమార్

    #WATCH | Ayodhya: Uttar Pradesh Special ADGLO Prashant Kumar says, "People have gathered here in huge numbers. Principal Home Secretary and I have been sent here... We have improved the queue system for crowd management. We have made channels for the people..." pic.twitter.com/9b5BC05DU5

    — ANI (@ANI) January 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    శ్రీరాముడు
    తాజా వార్తలు
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అయోధ్య

    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? నరేంద్ర మోదీ
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? నరేంద్ర మోదీ
    Amitabh Bachchan: అయోధ్యలో ప్లాట్‌ను కొనుగోలు చేసిన అమితాబ్.. ఎన్నికోట్లో తెలుసా? అమితాబ్ బచ్చన్
    అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం.. నేటి నుంచి 22వరకు ఏ రోజున ఏం చేస్తారంటే?  శ్రీరాముడు

    శ్రీరాముడు

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల అయోధ్య

    తాజా వార్తలు

    Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా? అయోధ్య
    Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా?  అయోధ్య
    Plane crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. భారత్ కీలక ప్రకటన ఆఫ్ఘనిస్తాన్
    Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే  అయోధ్య

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   శ్రీరాముడు
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  తాజా వార్తలు
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025