NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు..  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు..  

    SLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి జీపీఆర్‌ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సహాయంతో సిగ్నళ్లను పంపించగా,8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నళ్లు ప్రతిబింబించాయి.

    ఆ ప్రదేశాల లోతును లెక్కించి,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి వివరాలను అందజేశాం.ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేసి, రెండు చోట్ల తవ్వకాలు చేపట్టగా, యంత్ర పరికరాలు బయటపడ్డాయి.

    ఆ ప్రాంతాలను పక్కన పెట్టి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు కొనసాగించాలని సూచించాం.

    త్వరలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం''అని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. సత్యనారాయణ తెలిపారు.

    వారంపాటు సహాయ చర్యల్లో పాలుపంచుకున్న ఆయన తన కార్యాలయానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా, తన అనుభవాలను ప్రముఖ మీడియాతో పంచుకున్నారు.

    వివరాలు 

     కార్మికుల జాడ కోసం 200మెగాహెర్ట్జ్‌ సిగ్నళ్లు 

    ''జీపీఆర్‌ ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్‌ కిరణాలను పంపించి, వస్తువులను గుర్తిస్తాం. ఏరోస్పేస్‌ రంగంలో ఈ రాడార్‌ సహాయంతో శత్రువుల విమానాలను గుర్తిస్తారు. అక్కడ ఆకాశంలో ఉన్న వస్తువు ఒకటే అవుతుంది. తాకి తిరిగి వచ్చిన సిగ్నళ్ల ఆధారంగా ఆ వస్తువును ఖచ్చితంగా గుర్తించగలుగుతాం. ఇదే విధంగా భూమి లోపల సిగ్నళ్లను పంపించి, అక్కడ ఉన్న పొరల్లో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం.

    సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి 200మెగాహెర్ట్జ్‌ సిగ్నళ్లను పంపించాం.ఈ సిగ్నళ్లు భూమి లోపలికి వెళ్లి,ఏదైనా అడ్డంకి ఉంటే వెనక్కి ప్రతిబింబిస్తాయి.వచ్చే సిగ్నళ్ల తీవ్రతను విశ్లేషించి, లక్ష్యభూమి ఎక్కడ ఉందో మ్యాప్‌ చేస్తాం. తవ్వకాల్లో డ్రిల్లింగ్‌ యంత్ర భాగాలు బయటపడ్డాయి. ఈ యంత్ర భాగాల నుండి ప్రతిబింబించిన సిగ్నళ్లను కూడా విశ్లేషించాం.

    వివరాలు 

    సొరంగం కొండ క్రింద 500 మీటర్ల లోతులో..

    టన్నెల్‌ లోపల మాత్రమే కాకుండా, కూలిన ప్రదేశాన్ని కొండ పైనుంచీ గుర్తించేందుకు ప్రయత్నించాం.టైమ్‌ డొమైన్‌ ఎలక్ట్రో మాగ్నటిక్‌ సాంకేతికత ద్వారా భూమి పొరలను పరిశీలించాం. 200 మీటర్ల లోతు వరకు వివరాలు పొందగలిగాం. అయితే, సొరంగం కొండ క్రింద 500 మీటర్ల లోతులో ఉంది. మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటే, ప్రభుత్వ సూచన మేరకు ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని సత్యనారాయణ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్ పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    తెలంగాణ

    Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ  నిజామాబాద్
    Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు! రేవంత్ రెడ్డి
    SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు భారతదేశం
    Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025