NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్ 
    తదుపరి వార్తా కథనం
    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్ 
    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్

    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

    తమ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని కేసీఆర్ అన్నారు.

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

    తెలంగాణ

    తెలంగాణ ప్రథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు

    తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్‌గా నిలిచిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

    అతి తక్కువ వ్యవధిలో సంక్షేమ పాలన అందించి అద్భతమైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు.

    రాష్ట్రాన్ని దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఇంత ప్రగతి కేవలం ఆరేళ్లలోనే సాధించామని, కరోనా వల్ల మిగతా మూడేళ్లలో ఆశించినంత పురగోతి సాధించినలేదన్నారు.

    తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందినట్లు కేసీఆర్ చెప్పారు.

    రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలోనే మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచి నీరు అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.

    తెలంగాణ

    1.5 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు

    తెలంగాణ ప్రభుత్వం జూన్ 24 నుంచి 1.5 లక్షల మంది గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల 'పోడు' భూమి పట్టాలను పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.

    ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగమన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుల ఒక అద్భుతం అన్నారు.

    దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు దళిత బంధును తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 9 ఏళ్లలో రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు పెరిగిందన్నారు కేసీఆర్.

    రాష్ట్ర జీఎస్‌డీపీ 2014లో రూ.5.06 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.13 లక్షల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.

    EMBED

    అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.#తెలంగాణదశాబ్దిఉత్సవాలు#TelanganaTurns10 #TelanganaFormationDay pic.twitter.com/zV93Sk6iZ0— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తాజా వార్తలు

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    తెలంగాణ

    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి టీఎస్ఆర్టీసీ
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు రాష్ట్రం
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్ ప్రభుత్వం
    వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే  భారతదేశం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్
    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణ

    తాజా వార్తలు

    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025