Page Loader
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు 
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు 

వ్రాసిన వారు Stalin
Sep 06, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాయదుర్గం పోలీసులు ఎస్సై రాజేంద్రను కస్టడీలోకి తీసుకొని, కూకట్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు రెండు రోజుల పాటు అతనికి పోలీస్ కస్టడీకి విధించింది. ఎస్సై రాజేంద్రకు డ్రగ్స్ ముఠాలకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల మేరకు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర ఇంటి నుంచి 1,775 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐపై కేసు నమోదైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తర్వులు జారీ చేసిన  సీపీ స్టీఫెన్ రవీంద్ర