
AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్తో ఫలితాలు మీ ఫోన్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులకు సులభంగా ఫలితాలు అందేలా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించింది.
ఇందుకోసం 95523 00009 నంబర్కు "Hi" అని మెసేజ్ పంపితే ఫలితాలు మీ మొబైల్కి వస్తాయని మంత్రి తెలిపారు.
Details
ఫలితాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
అలాగే, ఫలితాలను తెలుసుకునేందుకు APResults.bie.gov.in, resultsbie.ap.gov.in వెబ్సైట్లను కూడా వినియోగించవచ్చు.
అంతేకాకుండా మనం మిత్ర యాప్ ద్వారానే కూడా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఫలితాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్వీట్ చేసిన నారా లోకేశ్
🚨 Intermediate Results Update:🚨
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
Kindly note that the results for the Intermediate Public Examination (IPE) 2025 for 1st and 2nd-year students will be available on 12th April, 2025 from 11 AM onwards!
Students can check their results online at https://t.co/UDtk11bzit.…