వినాయక చవితి రోజున గణేషుడికి ఇష్టమైన నైవేద్యాలను ఎలా చేయాలో తెలుసుకోండి
వినాయక చవితి రోజున గణేషుడికి ఇష్టమైన ఆహారాల్లో కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాళికలు ఉంటాయి. ఈరోజున ఖచ్చితంగా ఈ ఆహారాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కొందరికి ఈ ఆహారాలను ఎలా తయారు చేయాలో తెలియదు. ప్రస్తుతం వినాయకుడికి ఇష్టమైన ఆహారాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. బెల్లం కుడుములు: ఒక పాత్రలో నీరు పోసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడిని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి బియ్యపు పిండిని కలపాలి. ఆ తర్వాత ఆ పిండిముద్దతో మీకు నచ్చిన ఆకారంలో కుడుములను తయారు చేయండి.
ఉండ్రాళ్ళు
బియ్యం నూక, శనగపప్పు తీసుకోవాలి. ఆ తర్వాత పెనం మీద నెయ్యిలో జీలకర్ర వేయించాలి. ఇప్పుడు పెనంలో కొన్ని నీళ్ళు కలపాలి. తర్వాత శనపప్పును ఆ నీళ్లలో ఉడికించాలి. ఇప్పుడు బియ్యం నూకను నీటిలో వేయాలి. ఇప్పుడు ఉప్మా మాదిరి తయారవుతుంది. ఆ తర్వాత ఉండ్రాళ్ళు చుట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రమీద ఉండ్రాళ్ళను ఉడికించాలి. అంతే.
పాలతాలికలు
పెనంలో నీళ్ళు పోసి మరిగించి బెల్లం వేయండి. బెల్లం కరగగానే బియ్యపు పిండిని అందులో వేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కకు తీసి తాలికలు చేయండి. ఈ తాలికలను మరుగుతున్న పాలలో వేయాలి. ఆ తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకుని ఆ పాలల్లో కలపండి. అంతే, తాలికలు రెడీ ఐపోయినట్టే. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, బెల్లం పాకం చల్లారిన తర్వాత మాత్రమే పాలలో కలుపుకోవాలి. లేదంటే పాలు విరిగిపోతాయి.