LOADING...
Iran - USA: పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

Iran - USA: పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గురువారం నుంచి ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతూ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ఇరాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో మంటలు చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే కువైట్‌లోని అమెరికా స్థావరాలపై కూడా దాడులు జరిగినట్లు పేర్కొంది. అయితే తమ గగనతలంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.

వివరాలు

హర్మూజ్ జలసంధిలో దాడులతో ఉద్రిక్తత..

హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో తాజా ఘర్షణలకు మరింత ఊపందుకుంది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకలపై జరిగే దాడులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ చేపట్టే ప్రతి దాడికి అమెరికా నుంచి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల రాత్రి నిర్వహించిన అమెరికా దాడుల తర్వాత ఇరాన్ చర్చలకు సిద్ధమవుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement