NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / JioTele OS: స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్‌ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    JioTele OS: స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్‌ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి.. 
    స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్‌ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి..

    JioTele OS: స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్‌ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ జియో సంస్థ స్మార్ట్ టీవీల కోసం జియోటెలీ ఓఎస్ (JioTele OS) ను పరిచయం చేసింది.

    భారతీయ ప్రేక్షకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

    స్మార్ట్ టీవీ కంటెంట్‌ను మరింత మందికి చేరువ చేయడం, ప్రాంతీయ కంటెంట్‌ను అందించడం జియోటెలీ ఓఎస్ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.

    అందుబాటు ధరలో ప్రీమియం కంటెంట్‌ను, స్మార్ట్ టీవీ ఫీచర్లను జియోటెలీ ఓఎస్‌తో అందించవచ్చని కంపెనీ వివరించింది.

    థామ్సన్, కోడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్లు జియోటెలీ ఓఎస్‌తో పనిచేసే టీవీలు ఫిబ్రవరి 21 నుండి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

    ఈ ఏడాది చివరిలో మరిన్ని బ్రాండ్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై స్మార్ట్ టీవీలను విడుదల చేస్తాయని సూచించింది.

    వివరాలు 

    ప్రధాన ఫీచర్లు 

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పర్సనలైజ్డ్ కంటెంట్‌ను సిఫార్సు చేస్తుంది.

    4K కంటెంట్‌ను అందించే టీవీల్లో ల్యాగ్ సమస్య ఉత్పన్నం కాదని , స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించవచ్చని తెలిపింది.

    టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్, క్లౌడ్ గేమింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. సింగిల్ రిమోట్‌తో అన్ని రకాల కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

    కొత్త యాప్స్‌కు సపోర్ట్ చేయడానికి, కొత్త సాంకేతికతను అందించడానికి ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది.

    జియో సంస్థ గతంలో జియోటీవీ ఓఎస్‌ను పరిచయం చేసింది. జియో సెట్‌టాప్ బాక్సులకు సపోర్ట్‌ చేసే విధంగా టీవీ ఓఎస్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా పరిచయమైన జియోటెలీ ఓఎస్‌తో ఆయా బ్రాండ్లు టీవీలను విడుదల చేయనున్నాయి.

    వివరాలు 

    ప్యూర్ ఈవీతో జియో థింగ్స్ జట్టు 

    ప్యూర్ ఈవీతో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్ ఎంవోయూ కుదుర్చుకుంది.

    దీని ప్రకారం జియో థింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్‌ను ప్యూర్ ఈవీకి అనుసంధానం చేయనుంది.

    అధునాతన ఐవోటీ సొల్యూషన్స్ ద్వారా తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు జియో థింగ్స్‌తో జట్టుకట్టినట్లు కంపెనీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    జియో

    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో ప్లాన్
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025