Loading...
Elon Musk: వచ్చే ఏడాదిలోనే ఏఐ సూపర్‌హ్యూమన్‌.. ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

Elon Musk: వచ్చే ఏడాదిలోనే ఏఐ సూపర్‌హ్యూమన్‌.. ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక అంచనా వేశారు. ఏఐ వ్యవస్థలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని,ఇదే వేగం కొనసాగితే వచ్చే ఏడాదికే అవి 'మానవాతీత స్థాయికి' చేరుకునే అవకాశం ఉందని అన్నారు. వెర్సెల్‌ సీఈఓ గిల్లెర్మో రౌచ్‌ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టుకు స్పందిస్తూ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మస్క్‌ చెప్పిన'మానవాతీత స్థాయి'అనేది ప్రధానంగా డిజిటల్‌ ప్రపంచానికే పరిమితం కావచ్చని స్పష్టం చేశారు. అంటే కంప్యూటర్‌ ఆధారిత పనుల్లో ఏఐ మనుషులను మించే సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికంగా వస్తువులను కదిలించడం, ఇతర రకాల శారీరక పనులు చేయడం వంటి వాటికి ఈ సామర్థ్యం వెంటనే వర్తించకపోవచ్చని పేర్కొన్నారు.

వివరాలు 

ప్రస్తుతం ఏఐ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ మోడళ్లు ఇప్పటికే అనేక డిజిటల్‌ పనుల్లో వేగంగా మెరుగుపడుతున్నాయి.

కోడింగ్‌ చేయడం,ఫైళ్లను నిర్వహించడం,ప్రెజెంటేషన్లు రూపొందించడం వంటి పనులను ఏఐ ఆధారిత వ్యవస్థలు సమర్థంగా నిర్వహిస్తున్నాయి.

భవిష్యత్తులో ఈసామర్థ్యాలు మరింత పెరిగి,ప్రస్తుతం చేస్తున్న పనులను ఇంకా వేగంగా,సమర్థంగా చేసే అవకాశం ఉంది.

అలాగే కొత్తరకాల పనులను కూడా ఏఐ చేపట్టే అవకాశం ఉందని మస్క్‌ అంచనా సూచిస్తోంది.

అయితే ఏఐ అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగితే దాని దుర్వినియోగంపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి.

మరింత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు తప్పు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వాటిని హానికరమైన పనులకు ఉపయోగించే అవకాశం ఉందనే భయాలు ఉన్నాయి.

అందుకే ఏఐ అభివృద్ధితో పాటు భద్రతా చర్యలు కూడా కీలకంగా మారుతున్నాయి.

వివరాలు 

స్వయంచాలకంగా హ్యాకింగ్‌ చేసే ఏఐ?

వెర్సెల్‌ సీఈఓ గిల్లెర్మో రౌచ్‌ కూడా భవిష్యత్తులో ఏఐ వల్ల ఎదురయ్యే సైబర్‌ భద్రతా ముప్పులపై హెచ్చరించారు.

కొత్త ఇంటర్నెట్‌ యుగంలో ఏఐ ఏజెంట్లు స్వయంగా సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి,వాటిని ఉపయోగించి వ్యవస్థలను హ్యాక్‌ చేసే పరిస్థితి రావచ్చని ఆయన అన్నారు.

హ్యాక్‌ చేయగలిగే ఏ వ్యవస్థ అయినా చివరికి హ్యాక్‌ అయ్యే అవకాశముందని,అది కూడా ఏఐ ద్వారా స్వయంచాలకంగా జరగొచ్చని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందిన ఏఐ వ్యవస్థలు ఎంత స్వతంత్రంగా పనిచేయగలవనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

మనుషుల ప్రత్యక్ష జోక్యం లేకుండానే డిజిటల్‌ ప్రపంచంలో కొన్ని పనులను ఏఐ చేయగలిగితే, దాని వల్ల ప్రయోజనాలతో పాటు సైబర్‌ భద్రతకు కొత్త సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT