NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం
    రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం

    Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 11, 2025
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.

    ఈ సమీక్షలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

    అసెంబ్లీ హాలులో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి సీఎస్‌ ఎ.శాంతికుమారి, డీజీపీ జితేందర్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, చీఫ్‌ మార్షల్‌ కర్ణాకర్ తదితర అధికారులు హాజరయ్యారు.

    Details

    హుందాతనాన్ని పెంపొందించాలి

    సభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించేలా ఏర్పాట్లు చేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్ సూచించారు.

    ఈసారి బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముండడంతో, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు.

    సభ్యుల అడిగిన సమాచారాన్ని తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు.

    అదే సమయంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో ముద్రించి ముందుగా అందిస్తే, సభ్యులకు సిద్ధం కావడానికి అనువుగా ఉంటుందని సూచించారు.

    Details

    భద్రతా చర్యలు కట్టుదిట్టం 

    సమావేశాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

    అసెంబ్లీ, శాసనమండలి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసుశాఖను ఆదేశించారు.

    సమావేశాలు జరుగుతున్న రోజులలో శాంతిభద్రతలు కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

    సచివాలయంలో సమీక్ష

    సమావేశాలకు ముందు, సచివాలయంలో సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన మరో సమీక్ష సమావేశం జరిగింది.

    బడ్జెట్‌ సెషన్‌లో సరైన సమాచారం అందించేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని, శాఖల వారీగా నోడల్‌ అధికారులను నియమించుకోవాలని సీఎస్‌ సూచించారు.

    ఈ ఏర్పాట్లతో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    SLBC tunnel Collapse : SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి భారతదేశం
    SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్! భారతదేశం
    Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే! యాదాద్రి
    SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం శ్రీశైలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025