LOADING...
IND vs ENG: నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి తడబడింది. బ్యాటింగ్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. దీంతో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటిన ఇంగ్లండ్‌ ఏకపక్షంగా విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకా ఒక పోరు మిగిలి ఉండగానే వరుసగా మూడో విజయాన్ని అందుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐర్లాండ్‌ చేతిలో 0-2తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌ ఎదుట కూడా తలవంచాల్సి వచ్చింది. గురువారం జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

వివరాలు

ఇన్నింగ్స్ సాగిందిలా..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే చివరి వరకు అజేయంగా నిలిచి 49 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇంగ్లాండ్‌ తరఫున జోఫ్రా ఆర్చర్‌ 20 పరుగులిచ్చి రెండు వికెట్లు, జోష్‌ టంగ్‌ 36 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు. విల్‌ జాక్స్‌ ఒక వికెట్‌ తీసుకోగా, సామ్‌ కరన్‌ వికెట్‌ దక్కకపోయినా నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి పరుగుల వేగాన్ని నియంత్రించాడు.

వివరాలు

చేజారిన ట్రోఫీ 

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధాటిగా ఆడారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ 35 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలవగా, ఫిల్‌ సాల్ట్‌ 42 బంతుల్లో 59 పరుగులతో అతనికి అండగా నిలిచాడు. ఈ జోడీ చెలరేగడంతో ఇంగ్లాండ్‌ కేవలం 13.5 ఓవర్లలోనే ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సాధించి ట్రోఫీని ఖాయం చేసుకుంది.

Advertisement