LOADING...
Suryakumar Yadav: ఒమన్ జట్టు ఆట ఆద్భుతం : సూర్యకుమార్ యాదవ్
ఒమన్ జట్టు ఆట ఆద్భుతం : సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: ఒమన్ జట్టు ఆట ఆద్భుతం : సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో భారత జట్టు శుక్రవారం అబుదాబీలో ఒమన్‌తో ఎదురైన మ్యాచులో 21 పరుగుల తేడాతో గెలిచింది. 189 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒమన్ దాదాపు చేరువగా వచ్చింది. ఈ విషయాన్ని టీమ్‌ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టంగా పేర్కొన్నారు. హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ సూపర్బ్ ప్రదర్శన ఇచ్చారు. ఒమన్ బాగా ఆడింది. వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి విధానంలో పట్టుదల ఉన్నందున, అది ఆటలో కనిపించింది. వారి బ్యాటింగ్‌ను ఆస్వాదించానని చెప్పారు. తన బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువ స్థానం (కుల్ దీప్ యాదవ్ కంటే కూడా) లోకి వెళ్లిన అంశం గురించి చర్చించారు.

Details

ప్రశంసలు కురిపించిన సంజు శాంసన్

తరువాతి మ్యాచ్‌లో నంబర్ 11 కంటే ముందు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తానని, హార్దిక్ పాండ్య రనౌట్ కావడం దురదృష్టకరమని చెప్పారు. సంజు శాంసన్ కూడా ఒమన్ జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. ముఖ్యంగా బౌలర్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. "మైదానం చాలా వేడిగా ఉంది. ఇటీవల ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాను. కొత్త ట్రైనర్‌తో బ్రాంకో టెస్ట్ కూడా చేశాం. ఒమన్ ఆటగాళ్లు పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేశారు, స్వింగ్‌ని రాబట్టారని సంజు చెప్పారు. ఇక ఆదివారం సూపర్-4లో భారత జట్టు పాకిస్థాన్‌తో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనుంది. సూపర్-4లో భారత్ సత్తా చాటాలని అభిమానులు అశిస్తున్నారు.