Page Loader
PM Modi: మోదీని కలిసిన టీమ్​ఇండియా - ప్లేయర్స్​తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని 
PM Modi: మోదీని కలిసిన టీమ్​ఇండియా - ప్లేయర్స్​తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని

PM Modi: మోదీని కలిసిన టీమ్​ఇండియా - ప్లేయర్స్​తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2024
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా ఈ ట్రోఫీని తీసుకుని స్వదేశానికి వచ్చిన టీమ్​ఇండియా ప్లేయర్లు ప్రధాన మంత్రి మోదీని కలిశారు. ముందుగా వారికి దిల్లీ ఎయిర్ పోర్ట్​ దగ్గరే అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం వారు ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. అక్కడ కూడా ఘన స్వాగతం దక్కింది. డప్పు శబ్దాలకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా చిందులేశారు. అనంతరం అక్కడి నుంచి భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిసేందుకు 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

మోదీ

మోదీ అభినందనలు

ఈ సందర్భంగా మోదీ ప్రతీ క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం కూడా చేశారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి వారంతా విమానాశ్రయానికి బయలు దేరారు. అక్కడి నుంచి వీరంతా నేరుగా ముంబయికి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో, ఆ తర్వాత వాంఖడే వేదికగా వీరిందరికీ సన్మానం జరగనుంది. ఇకపోతే ఫైనల్‌ మ్యాచ్​ రోజునే ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి ప్లేయర్లతో మాట్లాడారు. వారిని అభినందించారు. ఎందుకంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ నెగ్గింది. చివరిగా 2003లో టీ20 వరల్డ్ కప్​, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2013లో వన్డే ప్రపంచ కప్‌ను దక్కించుకుంది టీమ్​ఇండియా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ ఇంటి నుంచి తిరిగి పయనమైన టీమిండియా