NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ
    తదుపరి వార్తా కథనం
    టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ
    వెటరన్ పేసర్ శిఖా పాండే

    టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2022
    09:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

    వెటరన్ పేసర్ శిఖా పాండేను మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, ఐర్లాండ్‌ల‌తో పాటు టీమిండియా గ్రూప్ -2లో ఉంది.

    వివాదాస్పదంగా జట్టు నుంచి తొలగించిన శిఖా చివరిసారిగా అక్టోబర్ 2021లో భారతదేశం తరుపున ఆడింది. ప్రస్తుతం ఆమె చేరికతో పేస్ బౌలింగ్ విభాగంలో బలం చేకూరనుంది.

    ఆమె టీ20 ఛాలెంజర్ ట్రోఫిలో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది.

    అంజలి

    మహిళల ప్రపంచ్ కప్‌లో తెలుగు అమ్మాయిలు

    టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి అంజలి శర్వాణి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఈ పేసర్‌ ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోవడంతో ప్రపంచకప్‌ జట్టులో అవకాశం దక్కించుకుంది.

    అలాగే మరో తెలుగు క్రికెటర్‌, ఓపెనర్‌ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.

    ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

    టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధ యాదవ్‌, రేణుక ఠాకూర్‌, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    ప్రపంచం

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    క్రికెట్

    నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది : మాజీ టెన్నిస్ స్టార్ ప్రపంచం
    ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో ప్రపంచం
    అన్నా డానిలినాతో జతకట్టనున్న సానియా మీర్జా ప్రపంచం
    హాకీ ప్రపంచ కప్‌కు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం ప్రపంచం

    ప్రపంచం

    గంగూలీకి గవాస్కర్ వార్నింగ్...బీసీసీఐ అధ్యక్షుడివి కాదంటూ క్రికెట్
    ఛతేశ్వర్ పుజారా సన్సేషనల్ రికార్డు క్రికెట్
    'అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్ట్రోక్స్ ఒకరు': మోర్గాన్ క్రికెట్
    వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన అటగాళ్లు వీరే.. క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025