Page Loader
U19 Womens Asia Cup: అండర్-19 మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీ ఫైనల్‌కు భారత్‌ 

U19 Womens Asia Cup: అండర్-19 మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీ ఫైనల్‌కు భారత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరుకుంది.శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో యువ భారత్‌ 4 వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.5ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష(32;24 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్స్‌లు),కమలిని (28; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మిథిల (17*; 12 బంతుల్లో 4 ఫోర్లు) ముఖ్యమైన రాణింపును చూపించారు. భారత అమ్మాయిలలో ప్రారంభ దశలో ఈశ్వరి (0) సానికా చాల్కే (4) విఫలమవడంతో 5 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయారు.

వివరాలు 

భవికా అండతో మిథిల జట్టును విజయం దిశగా..

తర్వాత, త్రిష,కమలిని నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ, వీరిద్దరూ త్వరగా ఔటయ్యారు. తరువాత కెప్టెన్ నిక్కీ ప్రసాద్ (3)కూడా త్వరగా వెనుదిరిగింది.ఈ సమయంలో భవికా (7) మిథిలకు అండగా నిలిచి, జట్టును విజయం వైపు నడిపించారు. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ మనుడి నానయక్కర (33; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు),సుముడు నిసంసాల (21) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. సజనా కవిండి (9),రష్మిక (8),హిరుణి హన్సిక (2),దహమి (5),లిమాన్స (1) ఒక్కో స్కోరులోనే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్లా (4/10) మరోసారి ప్రదర్శన చూపింది. పరుణికా సిసోడియా 2 వికెట్లు, షబ్నమ్‌ షకీల్‌,దృతి కేసరి ఒక్కో వికెట్ తీసుకున్నారు.