Loading...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారుల ఆందోళన.. జైలులో వైద్యం అందడం లేదని ఆరోపణ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారుల ఆందోళన.. జైలులో వైద్యం అందడం లేదని ఆరోపణ

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారుల ఆందోళన.. జైలులో వైద్యం అందడం లేదని ఆరోపణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారులు ఖాసిం, సులేమాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి సరైన వైద్య చికిత్స అందకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

'జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే'

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు నుంచి ప్రాణాలతో బయటకు రావడం కూడా కష్టమేనని కుమారుడు ఖాసిం ఆందోళన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్‌ తరఫున అంతర్జాతీయ న్యాయవాది జేర్డ్‌ గెన్సర్‌ ఆయన పరిస్థితిని 'స్లో-మోషన్‌ హత్య'గా అభివర్ణించినట్లు తెలిపారు.

గత మూడేళ్లుగా తన తండ్రిని ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఖాసిం ఆరోపించారు. కిటికీలు లేని సుమారు 6x8 అడుగుల గదిలో రోజుకు 23 గంటలకు పైగా బంధిస్తున్నారని చెప్పారు.

సరైన వైద్య సేవలు అందకపోవడం వల్లే ఇమ్రాన్‌ ఖాన్‌ తన కుడి కంటి చూపును దాదాపుగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు 

సుప్రీంకోర్టు ఆదేశాలపైనా అభ్యంతరం

ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ పాక్‌ ప్రభుత్వం అందుకు బదులుగా ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిందని కుమారులు ఆరోపించారు.

అనంతరం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించడాన్ని వారు తప్పుబట్టారు. గత ఆరు నెలలుగా తమ తండ్రితో ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశం లభించలేదని సులేమాన్‌ తెలిపారు.

ఇది మానవ హక్కుల స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్బంధం, ఆయనపై జరుగుతున్న వేధింపుల వెనుక పాకిస్థాన్‌ సైనిక వ్యవస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇమ్రాన్‌కు వైద్యం అందించాలని మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్‌ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని కోరుతూ 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్‌ కెప్టెన్లు పాకిస్థాన్‌ ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని సులేమాన్‌ గుర్తుచేశారు.

ఈ లేఖ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్‌ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైనట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సెప్టెంబర్‌ 16న విచారణ జరగనుంది.

ADVERTISEMENT