Page Loader
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి

Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి

వ్రాసిన వారు Stalin
Mar 17, 2024
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మవ్లావి మహ్మద్ ఖాసిం రియాజ్ తెలిపారు. గెరెష్క్ జిల్లాలో ఆదివారం ఉదయం హెరాత్ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు మోటార్ సైకిల్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత 10 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,600 మందికి పైగా మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

38 మందికి గాయాలు